ప్రస్తుతం చాలా మంది కుర్ర హీరోలు హిట్ లేక సతమతమవుతున్నారు. అందులో సత్యదేవ్ కూడా ఉన్నాడు. ఈ కుర్ర హీరోకి ఇంత వరకూ ఓ సూపర్ హిట్ పడలేదు. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా పరిచయమైన సత్య దేవ్ అప్పటి నుండి సోలో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. బ్లఫ్ మాస్టర్ రిలీజ్ తర్వాత పేరు తీసుకొచ్చింది తప్ప థియేటర్స్ లో ఆడలేదు. ఇక ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య కూడా ఓటీటీ లో ఫరవాలేదనిపించుకుంది.
ఇక ‘తిమ్మరుసు’ కి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను థియేటర్స్ కి రాప్పించలేకపోయింది. ఆ రకంగా సత్య దేవ్ క్రౌడ్ పుల్లర్ అనిపించుకోలేకపోయాడు. సత్య దేవ్ చేసిన ఈ మూడు సినిమాలు రీమేకే. ఇప్పుడు స్ట్రైట్ కథతో ‘గాడ్సే’ సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉంది అయినా ఎలాంటి బజ్ లేదు. ట్రైలర్ హిట్టయింది కానీ అది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే వచ్చిన వీడియోగా జనాలు చూస్తున్నారు తప్ప సినిమా చూడాలనే ఆసక్తి కనబరచడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ చూస్తే అది అర్థమవుతుంది.
ఏదేమైనా సత్య దేవ్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. కంటెంట్ తో ప్రేక్షకులను రాప్పించగలిగితే ఓ మోస్తారు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ‘ గుర్తుందా శీతాకాలం’ అనే మరో రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే ఫుల్ బాటిల్ అనే సినిమా సెట్స్ పై ఉంది. రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. చిరంజీవి తో గాడ్ ఫాదర్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఇలా సత్య బిజీగానే ఉన్నాడు కానీ సక్సెస్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అది తోడైతే ఈ కుర్ర హీరో ఇంకా బిజీ అయిపోవడం ఖాయం.
This post was last modified on June 15, 2022 5:07 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…