ప్రస్తుతం చాలా మంది కుర్ర హీరోలు హిట్ లేక సతమతమవుతున్నారు. అందులో సత్యదేవ్ కూడా ఉన్నాడు. ఈ కుర్ర హీరోకి ఇంత వరకూ ఓ సూపర్ హిట్ పడలేదు. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా పరిచయమైన సత్య దేవ్ అప్పటి నుండి సోలో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. బ్లఫ్ మాస్టర్ రిలీజ్ తర్వాత పేరు తీసుకొచ్చింది తప్ప థియేటర్స్ లో ఆడలేదు. ఇక ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య కూడా ఓటీటీ లో ఫరవాలేదనిపించుకుంది.
ఇక ‘తిమ్మరుసు’ కి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను థియేటర్స్ కి రాప్పించలేకపోయింది. ఆ రకంగా సత్య దేవ్ క్రౌడ్ పుల్లర్ అనిపించుకోలేకపోయాడు. సత్య దేవ్ చేసిన ఈ మూడు సినిమాలు రీమేకే. ఇప్పుడు స్ట్రైట్ కథతో ‘గాడ్సే’ సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉంది అయినా ఎలాంటి బజ్ లేదు. ట్రైలర్ హిట్టయింది కానీ అది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే వచ్చిన వీడియోగా జనాలు చూస్తున్నారు తప్ప సినిమా చూడాలనే ఆసక్తి కనబరచడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ చూస్తే అది అర్థమవుతుంది.
ఏదేమైనా సత్య దేవ్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. కంటెంట్ తో ప్రేక్షకులను రాప్పించగలిగితే ఓ మోస్తారు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ‘ గుర్తుందా శీతాకాలం’ అనే మరో రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే ఫుల్ బాటిల్ అనే సినిమా సెట్స్ పై ఉంది. రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. చిరంజీవి తో గాడ్ ఫాదర్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఇలా సత్య బిజీగానే ఉన్నాడు కానీ సక్సెస్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అది తోడైతే ఈ కుర్ర హీరో ఇంకా బిజీ అయిపోవడం ఖాయం.
This post was last modified on June 15, 2022 5:07 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…