ప్రస్తుతం చాలా మంది కుర్ర హీరోలు హిట్ లేక సతమతమవుతున్నారు. అందులో సత్యదేవ్ కూడా ఉన్నాడు. ఈ కుర్ర హీరోకి ఇంత వరకూ ఓ సూపర్ హిట్ పడలేదు. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా పరిచయమైన సత్య దేవ్ అప్పటి నుండి సోలో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. బ్లఫ్ మాస్టర్ రిలీజ్ తర్వాత పేరు తీసుకొచ్చింది తప్ప థియేటర్స్ లో ఆడలేదు. ఇక ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య కూడా ఓటీటీ లో ఫరవాలేదనిపించుకుంది.
ఇక ‘తిమ్మరుసు’ కి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను థియేటర్స్ కి రాప్పించలేకపోయింది. ఆ రకంగా సత్య దేవ్ క్రౌడ్ పుల్లర్ అనిపించుకోలేకపోయాడు. సత్య దేవ్ చేసిన ఈ మూడు సినిమాలు రీమేకే. ఇప్పుడు స్ట్రైట్ కథతో ‘గాడ్సే’ సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉంది అయినా ఎలాంటి బజ్ లేదు. ట్రైలర్ హిట్టయింది కానీ అది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే వచ్చిన వీడియోగా జనాలు చూస్తున్నారు తప్ప సినిమా చూడాలనే ఆసక్తి కనబరచడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ చూస్తే అది అర్థమవుతుంది.
ఏదేమైనా సత్య దేవ్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. కంటెంట్ తో ప్రేక్షకులను రాప్పించగలిగితే ఓ మోస్తారు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ‘ గుర్తుందా శీతాకాలం’ అనే మరో రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే ఫుల్ బాటిల్ అనే సినిమా సెట్స్ పై ఉంది. రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. చిరంజీవి తో గాడ్ ఫాదర్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఇలా సత్య బిజీగానే ఉన్నాడు కానీ సక్సెస్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అది తోడైతే ఈ కుర్ర హీరో ఇంకా బిజీ అయిపోవడం ఖాయం.
This post was last modified on June 15, 2022 5:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…