తమ సినిమాల మీద నిర్మాతలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పు లేదు కానీ పోటీ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అసలే బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. బడ్జెట్ మూవీస్ వస్తున్నాయంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఓటిటిలో చూద్దాంలే అనే ధోరణి, ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ లాంటివి అనుభూతి చెందాక థియేటర్ కంటెంట్ విషయంలో మారిపోయిన అభిప్రాయాలు ఇవన్నీ చిన్న చిత్రాలకు ఇబ్బందికరంగా మారాయి. అయినా ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు.
వచ్చే వారం 24న ఏకంగా ఎనిమిది సినిమాలో బరిలో ఉండటం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నేసి ఆప్షన్లు ఉంటే అరకొరగా వచ్చే ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి వస్తుందని దీనివల్ల నష్టపోయే వాళ్లే ఎక్కువగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి లిస్టు వైపు లుక్ వేస్తే కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ మీద యూత్ కి ఓ మాదిరి అంచనాలున్నాయి. ఉన్నట్టుండి డేట్ ప్రకటించిన ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ మాస్ సర్కిల్స్ ని నమ్ముకుని వస్తోంది. ఎంఎస్ రాజు గారి ‘7 డేస్ 6 నైట్స్’ని అదే రోజు బరిలో దింపుతున్నారు.
చాలా కాలంగా తెరమీద కనిపించడం మానేసిన సాయిరాం శంకర్ హీరోగా రూపొందిన ‘పధకం ప్రకారం’ ముందు నుంచి ప్లాన్ చేసుకోకుండా హఠాత్తుగా డేట్ వేసుకుంది. ఇవి కాకుండా గ్యాంగ్ స్టర్ గంగరాజు, టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, సదా నన్ను నడిపే సైతం రేస్ లో ఉన్నాయి. వీటికన్నా ఒకరోజు ముందు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’తో దిగుతున్నాడు. ఫైనల్ గా రెండే రోజుల్లో తొమ్మిది సినిమాలు టికెట్ కౌంటర్ల మీద దాడి చేయబోతున్నాయి. దేనికీ క్రేజీ ఓపెనింగ్ రాదు కానీ మొదటి రోజు వచ్చే టాక్ వీటికి చాలా కీలకం కానుంది. ఒక శుక్రవారాన్ని పెద్ద సినిమాలు పూర్తిగా వదిలేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇది. చూడాలి మరి వీటిలో ఎవరు నెగ్గుతారో.
This post was last modified on June 15, 2022 12:28 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…