Movie News

2 రోజుల్లో 9 సినిమాలు

తమ సినిమాల మీద నిర్మాతలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పు లేదు కానీ పోటీ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అసలే బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. బడ్జెట్ మూవీస్ వస్తున్నాయంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఓటిటిలో చూద్దాంలే అనే ధోరణి, ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ లాంటివి అనుభూతి చెందాక థియేటర్ కంటెంట్ విషయంలో మారిపోయిన అభిప్రాయాలు ఇవన్నీ చిన్న చిత్రాలకు ఇబ్బందికరంగా మారాయి. అయినా ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు.

వచ్చే వారం 24న ఏకంగా ఎనిమిది సినిమాలో బరిలో ఉండటం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నేసి ఆప్షన్లు ఉంటే అరకొరగా వచ్చే ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి వస్తుందని దీనివల్ల నష్టపోయే వాళ్లే ఎక్కువగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి లిస్టు వైపు లుక్ వేస్తే కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ మీద యూత్ కి ఓ మాదిరి అంచనాలున్నాయి. ఉన్నట్టుండి డేట్ ప్రకటించిన ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ మాస్ సర్కిల్స్ ని నమ్ముకుని వస్తోంది. ఎంఎస్ రాజు గారి ‘7 డేస్ 6 నైట్స్’ని అదే రోజు బరిలో దింపుతున్నారు.

చాలా కాలంగా తెరమీద కనిపించడం మానేసిన సాయిరాం శంకర్ హీరోగా రూపొందిన ‘పధకం ప్రకారం’ ముందు నుంచి ప్లాన్ చేసుకోకుండా హఠాత్తుగా డేట్ వేసుకుంది. ఇవి కాకుండా గ్యాంగ్ స్టర్ గంగరాజు, టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, సదా నన్ను నడిపే సైతం రేస్ లో ఉన్నాయి. వీటికన్నా ఒకరోజు ముందు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’తో దిగుతున్నాడు. ఫైనల్ గా రెండే రోజుల్లో తొమ్మిది సినిమాలు టికెట్ కౌంటర్ల మీద దాడి చేయబోతున్నాయి. దేనికీ క్రేజీ ఓపెనింగ్ రాదు కానీ మొదటి రోజు వచ్చే టాక్ వీటికి చాలా కీలకం కానుంది. ఒక శుక్రవారాన్ని పెద్ద సినిమాలు పూర్తిగా వదిలేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇది. చూడాలి మరి వీటిలో ఎవరు నెగ్గుతారో.

This post was last modified on June 15, 2022 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

15 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago