యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన గోపీచంద్కు కెరీర్లో ఒక దశ వరకు మంచి విజయాలే ఉన్నాయి. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం లాంటి చిత్రాలతో అతను బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకున్నాడు. కానీ ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్కు సరైన విజయమే దక్కలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సీటీమార్’ సినిమా కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలిచింది. కానీ టాలీవుడ్లో కల్చర్ ఏంటంటే.. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలందరికీ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా పారితోషకాలు పెరిగిపోతుంటాయి. గోపీచంద్ కూడా అందుకు మినహాయింపు కాదు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా అతను తన పారితోషకం గురించి మాట్లాడాడు. కెరీర్లో తొలిసారిగా ‘జయం’ సినిమాలో విలన్ పాత్రకు గాను కేవలం రూ.11 వేలు పారితోషకం తీసుకున్నట్లు వెల్లడించిన గోపీచంద్.. ‘పక్కా కమర్షియల్’ సినిమాకు అత్యధికంగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ పారితోషకం ఎంతన్నది గోపీచంద్ వెల్లడించలేదు. హిట్టు తర్వాత ఆటోమేటిగ్గా పారితోషకం పెరుగుతుంది కదా అంటూ ‘పక్కా కమర్షియల్’కు అత్యధికంగా పుచ్చుకున్నట్లు తెలిపాడు. కానీ గోపీచంద్ చివరి సినిమా ‘సీటీమార్’ ఫ్లాప్ అన్నది బాక్సాఫీస్ పండిట్ల మాట.
ఇక తన శైలికి భిన్నమైన మారుతితో ‘పక్కా కమర్షియల్’ చేయడం గురించి మాట్లాడుతూ.. మారుతి ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వినోదాత్మక సినిమాలు తీస్తాడని, దానికి తన శైలి యాక్షన్ కూడా తోడైతే ఇంకా పెద్ద సక్సెస్ సాధించవచ్చన్న ఉద్దేశంతో అతడితో సినిమా చేసినట్లు తెలిపాడు. మారుతి చాలా స్పీడు అని, అతడి శైలికి అలవాటు పడడానికి రెండు రోజులు టైం పట్టిందని.. తాను చిన్న మార్పు కూడా చెప్పడానికి అవకాశం లేకుండా అతను అద్భుతమైన స్క్రిప్టుతో ఈ సినిమాను తీర్చిదిద్దాడని గోపీ చెప్పాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…