ఈ మధ్యకాలంలో పెద్ద హీరో సినిమా డిజాస్టర్ అయితే దాని నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది, ఓ ఇరవై ఏళ్ళ క్రితం టెక్నాలజీ ఈ స్థాయిలో లేనప్పుడు చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలు ఫ్లాప్ అయినా సరే అభిమానంతోనో టైం పాస్ కు వేరే ఆప్షన్ లేదనే కారణంతోనో వాటిని థియేటర్లలో చూసేవాళ్ళు. దీని వల్ల చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చి నిర్మాతకు ఆర్థిక భారం తగ్గేది. వీడియో క్యాసెట్లు డివిడిల జమానాలోనూ వీటి తాకిడిని తట్టుకుని నిలబడ్డారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడా పరిస్థితులు మచ్చుకు కూడా లేవు.
ఉదయం షోకి అస్సలు బాలేదనే టాక్ వస్తే చాలు సాయంత్రం ఆటకి జనం ఉండటం లేదు. బుకింగ్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. కట్ చేస్తే ఎగ్జిబిటర్లకు అద్దెలు సైతం వసూలు కాని దయనీయ పరిస్థితి నెలకొంటోంది. ఇదంతా డిజిటల్ ట్రెండ్ మహాత్యమే. ఆ మధ్య ఆచార్యకు జరిగిన పరాభవం గుర్తుందిగా. రాధే శ్యామ్ ఎంతగా ఇబ్బంది పడిందో ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఖిలాడి పరిస్థితి మరీ ఘోరం. సర్కారు వారి పాటకు ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మూడో వారం నుంచే విపరీతమైన స్ట్రగుల్ చవిచూడాల్సి వచ్చింది.
తాజాగా బాలీవుడ్ లో మూడు వందల కోట్ల బడ్జెటని చెప్పుకుని వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ పట్టుమని వంద కోట్లు తేలేక గుడ్లు తేలేసింది. దెబ్బకు అమెజాన్ ప్రైమ్ తో యష్ రాజ్ సంస్థ ముందు చేసుకున్న ఒప్పందాన్ని సవరించుకుని కేవలం నాలుగు వారాల్లోనే ఓటిటి రిలీజ్ చేసేలా ఒప్పుకుని దానికిగాను అదనపు ఆదాయం అందుకుంది. పైన చెప్పిన కొన్ని తెలుగు సినిమాలకూ ప్రైమ్ ఇదే తరహా స్పెషల్ ఆఫర్ ఇచ్చి సదరు నిర్మాతలకు ఊరట కలిగించింది. ఒకవేళ కరోనా రాకపోయి ఓటిటి విప్లవం ఈ స్థాయిలో లేకపోతే ఖచ్చితంగా ఈ తరహా పరిస్థితులు ఉండేవి కాదేమో. అప్పుడు శాటిలైట్ మీద ఆధారపడాల్సి వచ్చేది. అంతా కాల మహత్యం.
This post was last modified on June 13, 2022 3:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…