‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత సత్య దేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే రీమేక్ సినిమా చేశాడు. ఆ సినిమా ఓటీటీలో విడుదలై ఓ మోస్తారుగా మెప్పించింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తాజాగా నాని తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటివలే నేచురల్ స్టార్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి నెరేషన్ ఇచ్చాడట. కేరాఫ్ కంచరపాలెం లాంటి రియలిస్టిక్ కథతోనే నాని ని అప్రోచ్ అయ్యాడని తెలుస్తుంది.
ఇక నానికి స్టోరీ నచ్చడంతో సినిమా ఫైనల్ చేశాడని టాక్. ప్రస్తుతం నాని శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా డెబ్బై శాతం షూట్ ఉంది. ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ కోసం బ్రేక్ ఇచ్చిన నాని త్వరలోనే దసరా మరో షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత #Nani30 గా వెంకటేష్ మహాతో సినిమా చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతానికయితే నాని నెక్స్ట్ సినిమా గురించి ఎక్కడా అప్ డేట్ ఇవ్వలేదు. దసరా రిలీజ్ తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయాలని చూస్తున్నాడు. మరి దసరాతో ఓ ప్రయోగం చేస్తున్న నాని వెంటనే వెంకటేష్ రియలిస్టిక్ స్క్రిప్ట్ తో మరో ప్రయోగం చేస్తాడా చూడాలి.
This post was last modified on June 11, 2022 9:45 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…