అన్ని అనుకున్నట్లు జరిగితే మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చే వారం థియేటర్స్ లోకి రావాలి. కానీ ఉన్నపళంగా రిలీజ్ డేట్ పోస్ట్ చేసుకోవడంతో ఆ ప్లేస్ లో రానా ‘విరాటపర్వం’ వచ్చి చేరింది. రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయంపై తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ టాక్ వినబడుతుంది. ఈ సినిమాకు సంబంధించి రవితేజకి ఇంకా రెమ్యునరేషన్ డీల్ క్లోజ్ అవ్వలేదని అందుకే రవితేజ బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ రావడం లేదని అంటున్నారు.
రవితేజ పక్కా కమర్షియల్. రెమ్యునరేషన్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుంటారు. దీంతో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మీద వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో అది రవితేజ మీద ఉన్న ఒపీనియన్ కి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. సినిమా అంతా పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ఫినిష్ చేస్తే సినిమా రిలీజైపోతుంది.
ఈ సినిమాకు రవితేజ బేనర్ కూడా యాడ్ అయింది. ఆర్ టి టీం వర్క్స్ ని కూడా షేర్ బేస్ లో ఇంక్లూడ్ చేసాడట రవితేజ. ఆ డీలింగ్ విషయంలో కూడా ఇంకా ఏవో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఏదేమైనా ఇది జస్ట్ రూమరెనా ? లేదా నిజంగానే సినిమా ఫైనాన్షియల్ ఇష్యుస్ ఫేజ్ చేస్తుందా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on June 10, 2022 7:48 pm
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…
కోలీవుడ్లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు,…
అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన…
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…