అన్ని అనుకున్నట్లు జరిగితే మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చే వారం థియేటర్స్ లోకి రావాలి. కానీ ఉన్నపళంగా రిలీజ్ డేట్ పోస్ట్ చేసుకోవడంతో ఆ ప్లేస్ లో రానా ‘విరాటపర్వం’ వచ్చి చేరింది. రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయంపై తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ టాక్ వినబడుతుంది. ఈ సినిమాకు సంబంధించి రవితేజకి ఇంకా రెమ్యునరేషన్ డీల్ క్లోజ్ అవ్వలేదని అందుకే రవితేజ బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ రావడం లేదని అంటున్నారు.
రవితేజ పక్కా కమర్షియల్. రెమ్యునరేషన్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుంటారు. దీంతో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మీద వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో అది రవితేజ మీద ఉన్న ఒపీనియన్ కి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. సినిమా అంతా పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ఫినిష్ చేస్తే సినిమా రిలీజైపోతుంది.
ఈ సినిమాకు రవితేజ బేనర్ కూడా యాడ్ అయింది. ఆర్ టి టీం వర్క్స్ ని కూడా షేర్ బేస్ లో ఇంక్లూడ్ చేసాడట రవితేజ. ఆ డీలింగ్ విషయంలో కూడా ఇంకా ఏవో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఏదేమైనా ఇది జస్ట్ రూమరెనా ? లేదా నిజంగానే సినిమా ఫైనాన్షియల్ ఇష్యుస్ ఫేజ్ చేస్తుందా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on June 10, 2022 7:48 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…