అన్ని అనుకున్నట్లు జరిగితే మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చే వారం థియేటర్స్ లోకి రావాలి. కానీ ఉన్నపళంగా రిలీజ్ డేట్ పోస్ట్ చేసుకోవడంతో ఆ ప్లేస్ లో రానా ‘విరాటపర్వం’ వచ్చి చేరింది. రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏమిటనే విషయంపై తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ టాక్ వినబడుతుంది. ఈ సినిమాకు సంబంధించి రవితేజకి ఇంకా రెమ్యునరేషన్ డీల్ క్లోజ్ అవ్వలేదని అందుకే రవితేజ బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్ రావడం లేదని అంటున్నారు.
రవితేజ పక్కా కమర్షియల్. రెమ్యునరేషన్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటుంటారు. దీంతో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మీద వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో అది రవితేజ మీద ఉన్న ఒపీనియన్ కి మరింత బలం చేకూరుస్తుంది. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్నాడు. సినిమా అంతా పూర్తయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ ఫినిష్ చేస్తే సినిమా రిలీజైపోతుంది.
ఈ సినిమాకు రవితేజ బేనర్ కూడా యాడ్ అయింది. ఆర్ టి టీం వర్క్స్ ని కూడా షేర్ బేస్ లో ఇంక్లూడ్ చేసాడట రవితేజ. ఆ డీలింగ్ విషయంలో కూడా ఇంకా ఏవో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఏదేమైనా ఇది జస్ట్ రూమరెనా ? లేదా నిజంగానే సినిమా ఫైనాన్షియల్ ఇష్యుస్ ఫేజ్ చేస్తుందా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on June 10, 2022 7:48 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…