ఏ టెక్నీషియన్ కి అయినా కొందరు నటుల మీద అమితమైన ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతో వారి సినిమాలకు బెస్ట్ అవుట్ పుట్ ఇస్తుంటారు. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కూడా అదే చేస్తున్నాడు. తమన్ బాలయ్య మీద ప్రేమతో మ్యూజిక్ ఇస్తూ ఆ సినిమాలను ఎలివేట్ చేస్తున్న విధానం చూస్తే ఆ విషయం యిట్టె అర్థమైపోతుంది. నిజానికి ఈ మధ్య కాలంలో తమన్ బెస్ట్ వర్క్ అంటే ‘అఖండ’ నే. ఆ సినిమాకు స్పీకర్లు పగిలిపోయేలా నెక్స్ట్ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. బాలయ్య మీద ప్రేమతో జై బాలయ్య అనే సాంగ్ కూడా కంపోజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ కి ఓ ఆంథెం అందించాడు.
అఖండ కోసం భారీ ఎక్యుప్ మెంట్ వాడాడు కూడా. రాత్రిపగలు తేడా లేకుండా ఆ సినిమాకు వర్క్ చేశాడు. బాలయ్య నటన చూస్తే గూస్ బంప్స్ వస్తుందని అందుకే హై వోల్టేజ్ స్కోర్ ఇచ్చానని ఆ సందర్భంలో చెప్పుకున్నాడు తమన్. దీంతో ఆ సినిమాకు సంబంధించి దర్శకుడు , హీరోకి సమానంగా తమన్ కి పేరొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమతో బాలయ్య సినిమాకు బెస్ట్ వర్క్ ఇస్తున్నాడు తమన్. గోపీచంద్ -బాలయ్య కాంబోలో వస్తున్న NBK107 టీజర్ తాజాగా రిలీజయింది. ఆ టీజర్ కి అదిరిపోయే స్కోర్ ఇచ్చి బాలయ్య కేరెక్టర్ ని ఎలివేట్ చేసాడు తమన్.
సినిమాకు కూడా అదే రేంజ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. అయితే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేనితో తమన్ కి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ బావ అని పిలుచుకుంటారు. అందుకే గోపీచంద్ మలినేని ప్రీవియస్ మూవీ ‘క్రాక్’ కి మంచి స్కోర్ తో పాటు బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అటు బాలయ్య మీద ఇష్టం ఇటు గోపీచంద్ సినిమా కావడంతో తమన్ NBK107 కి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన నేపథ్య సంగీతం గురించి గట్టిగా చెప్పుకోవాలని డిసైడ్ అయిపోయాడు.
This post was last modified on June 10, 2022 7:44 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…