పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అంటే సుందరానికీ’ వేడుకకు ముఖ్య అతిథిగా వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా హీరో నాని.. పవన్కేమీ సన్నిహితుడు కాదు. ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయతోనూ పరిచయం లేదు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో ఒక సినిమాకు కమిట్మెంట్ ఉంది తప్ప ఇప్పటిదాకా ఆ బేనర్లో సినిమా అయితే చేయలేదు. తన కుటుంబ కథానాయకుల సినిమాల వేడుకలకే రాని పవన్.. ఈ సినిమా వేడుకకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ మైత్రీ అధినేతలు పట్టుబట్టి.. దర్శకుడు హరీష్ శంకర్కు చెప్పించి మరీ పవన్ను ఈ వేడుకకు రప్పించారు.
నిజానికి ఇది బుధవారం జరగాల్సిన ఈవెంట్. కానీ పవన్ కోసమని గురువారం పెట్టారు. విడుదలకు కొన్ని గంటల ముందు ఇలా ఈవెంట్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదంతా పవన్ను కచ్చితంగా ఈ ఈవెంట్కు రప్పించడం కోసమే.
మైత్రీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఈ సినిమా గురించి ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలే వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా తప్పుకుందని.. సినిమా ఇంకా ఆలస్యం కానుందని.. అసలుంటుందా లేదా అని.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ప్రచారాలకు తెరదించి సినిమా కచ్చితంగా ఉంటుందని పవన్తో చెప్పించడానికి, ఆయన్నుంచి పరోక్షంగా ఒక కమిట్మెంట్ తీసుకోవడానికే మైత్రీ అధినేతలు ఇలా ప్లాన్ చేశారు. వాళ్లు కోరుకున్నట్లే పవన్ కూడా ఆ సినిమా ప్రస్తావన తెచ్చాడు.
మైత్రీ బేనర్లో హరీష్ దర్శకత్వంలో అతి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా మొదలవుతుందని చెప్పాడు. మరి ఇలా ఓ వేడుకలో ఆ మాట చెప్పాడంటే పవన్ నిలబెట్టుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఎన్నికలుంటాయన్న అంచనాల నేపథ్యంలో పవన్ ఎక్కడ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తాడేమో అన్న భయం మైత్రీ వారిలో ఉంది. అందుకే పవన్ను ఇలా కమిట్ చేయించేశారు. అభిమానులకు కూడా ఇది సంతోషం కలిగించే విషయమే. ఇక హరీష్ శంకర్కు ఇదెంత పెద్ద రిలీఫో చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on June 10, 2022 1:59 pm
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…