తన సినిమాల్లో రాజకీయ, సినీ ప్రత్యర్థుల మీద పంచులు వేయడం నందమూరి బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ‘అధినాయకుడు’ సినిమాలో విగ్రహాల రాజకీయం అంటూ అప్పుడు వైఎస్ ఫ్యామిలీ మీద పరోక్షంగా సెటైర్లు వేయడం తెలిసిందే. అలాగే ‘సింహా’ సినిమాలో చరిత్ర సృష్టించాలన్నా మేమే అంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలీ మీద కౌంటర్లు వేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా మరి కొన్ని సినిమాల్లోనూ పంచులు, కౌంటర్లు చూడొచ్చు.
ఇప్పుడు తన కొత్త సినిమాలోనూ బాలయ్య ఇదే బాటలో నడుస్తున్నట్లున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా టీజర్ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రోజు బాలయ్య బర్త్ డేను పురస్కరించుకుని ఈ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య వేసిన రెండు పంచులు చర్చనీయాంశం అయ్యాయి.
‘‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్’’ అనే డైలాగ్ జగన్ సర్కారును ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో మంచి ఊపు కనిపిస్తుండటం.. జగన్ సర్కారు మీద గట్టిగా ఎదురు దాడి చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య.. వైకాపా ప్రభుత్వం ఇచ్చే జీవోలకు విలువ లేదని పరోక్షంగా కౌంటర్ వేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక
బాలయ్య నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ డైలాగ్ చివర్లో ‘బోసిడీకే’ అనే పదం పెట్టారు. కొన్ని నెలల కిందట ఈ పదం ఏపీలో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. టీడీపీ నేత పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి ఈ మాట అనగా.. దీనికి రకరకాల భాష్యాలు చెప్పారు జనాలు. స్వయంగా జగనే ఇదో పెద్ద బూతు పదం అన్నట్లు పబ్లిక్ మీటింగ్లో చెప్పి సింపతీ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంత డిస్కషన్ తర్వాత బాలయ్య నోట ఈ పదం రావడం చర్చనీయాంశమైంది. ఇలా పరోక్షంగా తన మీద, తన ప్రభుత్వం మీద బాలయ్య పంచులు వేసిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజైనపుడు ఇబ్బంది పెట్టకుండా వదులుతారా అన్నది డౌట్.
This post was last modified on June 10, 2022 1:48 pm
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…