తన సినిమాల్లో రాజకీయ, సినీ ప్రత్యర్థుల మీద పంచులు వేయడం నందమూరి బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ‘అధినాయకుడు’ సినిమాలో విగ్రహాల రాజకీయం అంటూ అప్పుడు వైఎస్ ఫ్యామిలీ మీద పరోక్షంగా సెటైర్లు వేయడం తెలిసిందే. అలాగే ‘సింహా’ సినిమాలో చరిత్ర సృష్టించాలన్నా మేమే అంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలీ మీద కౌంటర్లు వేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా మరి కొన్ని సినిమాల్లోనూ పంచులు, కౌంటర్లు చూడొచ్చు.
ఇప్పుడు తన కొత్త సినిమాలోనూ బాలయ్య ఇదే బాటలో నడుస్తున్నట్లున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా టీజర్ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రోజు బాలయ్య బర్త్ డేను పురస్కరించుకుని ఈ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య వేసిన రెండు పంచులు చర్చనీయాంశం అయ్యాయి.
‘‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్’’ అనే డైలాగ్ జగన్ సర్కారును ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో మంచి ఊపు కనిపిస్తుండటం.. జగన్ సర్కారు మీద గట్టిగా ఎదురు దాడి చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య.. వైకాపా ప్రభుత్వం ఇచ్చే జీవోలకు విలువ లేదని పరోక్షంగా కౌంటర్ వేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక
బాలయ్య నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ డైలాగ్ చివర్లో ‘బోసిడీకే’ అనే పదం పెట్టారు. కొన్ని నెలల కిందట ఈ పదం ఏపీలో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. టీడీపీ నేత పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి ఈ మాట అనగా.. దీనికి రకరకాల భాష్యాలు చెప్పారు జనాలు. స్వయంగా జగనే ఇదో పెద్ద బూతు పదం అన్నట్లు పబ్లిక్ మీటింగ్లో చెప్పి సింపతీ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంత డిస్కషన్ తర్వాత బాలయ్య నోట ఈ పదం రావడం చర్చనీయాంశమైంది. ఇలా పరోక్షంగా తన మీద, తన ప్రభుత్వం మీద బాలయ్య పంచులు వేసిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజైనపుడు ఇబ్బంది పెట్టకుండా వదులుతారా అన్నది డౌట్.
This post was last modified on June 10, 2022 1:48 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…