ఈ వారం తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో అంటే సుందరం ఒకటే డామినేషన్ కానీ వచ్చే శుక్రవారం మాత్రం మరో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. విరాట పర్వం, గాడ్సే లు జూన్ 17న థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి. రానా-సాయిపల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల గత రెండు మూడు రోజులుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నారు.
ట్రైలర్ కు ఆశించిన దానికన్నా గొప్ప రెస్పాన్స్ అందింది. ప్రత్యేకంగా టాలీవుడ్ సెలబ్రిటీలకు వేసిన స్పెషల్ ప్రీమియర్ల నుంచి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక గాడ్సే ప్రమోషన్ సైతం స్పీడ్ మీదే ఉంది. దర్శకుడు గోపిగణేష్ పట్టాభి, సత్యదేవ్ పలు ప్రాంతాలు తిరుగుతూ పబ్లిసిటీ చేసే పనిలో ఉన్నారు. ఇందాక ట్రైలర్ వచ్చేసింది.
అంతా బాగానే ఉంది కానీ ఈ రెండు సినిమాలకు ఒక సమస్య ఉంది. ఇవి సోషల్ ఇష్యూస్ మీద చాలా సీరియస్ గా డిస్కస్ చేసే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్. ఎంటర్ టైన్మెంట్ పెద్దగా ఉండదు. ఆలోచింపజేసే ఆవేశపూరిత సంబాషణలు ఉంటాయి. నేపధ్యాలు వేరైనప్పటికీ సమాజాన్నిసూటిగా బుల్లెట్ లా ప్రశ్నించే కాన్సెప్ట్ తో రూపొందాయి.
అసలే జనాలు యాక్షన్ మూవీస్ కి బాగా అలవాటు పడ్డారు. కథలు బలంగా లేకపోయినా ఎలివేషన్లు అద్భుతంగా కుదిరిన కెజిఎఫ్ 2, విక్రమ్ లు అన్నేసి కోట్లు రాబట్టడానికి కారణం ఇదే. ఆర్ఆర్ఆర్ లోనూ ఫైట్లదే పైచేయి. పుష్పను కాపాడింది కమర్షియల్ అంశాలే. ఎఫ్3 అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి అదీ పాస్ అయ్యింది. సర్కారు వారి పాట మహేష్ ఇమేజ్ తో గట్టెక్కింది. కానీ ఇవేవి లేని విరాటపర్వం, గాడ్సేలు తమ ప్రయత్నంలోని నిజాయితీతోనే మెప్పించాల్సి ఉంటుంది. మరి ఆడియన్స్ అండగా నిలుస్తారా?
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…