కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమవుతున్న కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. తొలి రోజు మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్ళు రాబడుతుంది. ఇప్పటికే నూట యాబై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా అతి త్వరలోనే 200 కోట్ల (గ్రాస్) మార్క్ చేరుకోనుంది.
ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన అందరికీ నిర్మాత కమల్ నుండి బహుమతులు అందాయి. ముందుగా దర్శకుడు లోకేష్ కి లెక్సస్ బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చారు కమల్. అలాగే సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ పదమూడు మందికి బైకులు అందించారు. ఇక క్లైమాక్స్ లో రోలెక్స్ అంటూ గూస్ బంప్స్ తెప్పించి
సీక్వెల్ కి ఎలివేషన్ ఇచ్చిన సూర్య కి తన కాస్ట్లీ రోలెక్స్ వాచ్ ను గిఫ్టుగా ఇచ్చారు. అలాగే మిగతా టీంకి కూడా కమల్ నుండి బహుమతులు అందాయట. విక్రమ్ తో నిర్మాతగా కమల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సినిమా ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతుండటంతో సంతోషంలో మునకలేస్తున్నారు.
ఇక రిలీజ్ కి ముందు హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రేక్షకులతో మాట్లాడిన కమల్ సినిమా హిట్టయితే మళ్ళీ వచ్చి థాంక్స్ చెప్పుకుంటానని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సూపర్ సక్సెస్ అనిపించుకోవడంతో త్వరలోనే కమల్ ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన సుధాకర్ రెడ్డి కి అలాగే ప్రేక్షకులను కలుసుకోనున్నారు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…