క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు అడివి శేష్. తనలోని రచయిత, దర్శకుడు కూడా ఈ సినిమాలు పెద్ద విజయం సాధించడంలో కీలకమయ్యాయి. మేజర్ సినిమాకు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాడు శేష్. ఆ చిత్రానికి రచనా సహకారం అందిస్తూ.. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అద్భుతంగా పోషించి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంలో శేష్ కీలక పాత్ర పోషించాడు.
మేజర్ తెలుగు రాష్ట్రాల వరకు అంచనాలను మించి పెర్ఫామ్ చేస్తోంది. గత వారం వచ్చిన ఎఫ్-3ని పక్కన పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమా వైపు కదులుతున్నారు. కమల్ సినిమా విక్రమ్ తెలుగులో ఈ చిత్రానికి గట్టి పోటీనే ఇస్తున్నప్పటికీ.. ఓవరాల్గా శేష్ సినిమానే పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే మేజర్ ఓవరాల్గా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అందులో నాలుగింట మూడొంతులకు పైగా వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి.
ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఇక రాబోయేదంతా వారికి లాభమే. కాబట్టి ఈ చిత్రం తెలుగులో బ్లాక్బస్టర్ అని తీర్మానించేయొచ్చు. ఐతే మేజర్ రిలీజైన మిగతా భాషలు హిందీ, మలయాళంలో మాత్రం ఈ సినిమా అనుకున్నంత మేర సత్తా చాటలేకపోయింది. శేష్ హిందీ, మలయాళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం, అతను స్టార్ కాకపోవడం, ఇక్కడి నుంచి వచ్చే మాస్ సినిమాల టైపు మేజర్ కాకపోవడం ప్రతికూలం అయి ఉండొచ్చు.
పైగా హిందీలో భూల్ భూలయియా-2 ఇంకా బాగా ఆడుతుండగా.. కొత్తగా పృథ్వీరాజ్, విక్రమ్ మూవీస్ నుంచి పోటీ తప్పలేదు. మలయాళంలో పూర్తిగా విక్రమ్ ఆధిపత్యం నడుస్తోంది. దీంతో మేజర్ మీద ఈ భాషల ప్రేక్షకులు ఫోకస్ పెట్టలేదు. హిందీలో మేజర్ రూ.5 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టంగానే ఉంది. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని నిర్మాతలు అంటున్నప్పటికీ అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. అక్కడ ఈ సినిమా ఫ్లాప్ అయ్యేట్లే ఉంది.
This post was last modified on June 8, 2022 12:59 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…