నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే.. బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హడావుడి ఉంటుంది. ప్రోమోల హంగామా కనిపిస్తుంది. జనాలు పెద్ద ఎత్తున డిస్కషన్లు పెడతారు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్లోనూ మంచి ఊపు కనిపిస్తుంది. కానీ కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడా హడావుడి కనిపించడం లేదు.
అతడి కొత్త సినిమా అంటే సుందరానికీ రిలీజ్ ముంగిట అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. కరోనా టైంలో వి, టక్ జగదీష్ సినిమాల డిజిటల్ రిలీజ్తో తన బ్రాండ్ వాల్యూను దెబ్బ తీసుకున్నాడు నాని. శ్యామ్ సింగరాయ్తో కొంత లోటు పూడ్చుకున్నా, మళ్లీ ప్రేక్షకుల నమ్మకం పొందగలిగినా.. అంటే సుందరానికీ మూవీకి అది పెద్దగా కలిసొస్తున్నట్లు లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికీ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ టికెట్ల కోసం జనాలు అంతగా ఎగబడుతున్నట్లు కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగానే నడుస్తున్నాయి. కొన్ని షోలు మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం సినిమాకు బజ్ కాస్త తగ్గడంతో పాటు టికెట్ల ధరల ప్రభావం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. అధిక టికెట్ల ధరలు వరుసగా పెద్ద సినిమాలను దెబ్బ కొట్టడంతో మేజర్ లాంటి క్రేజీ మూవీకి వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర బృందం.
సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 195గా రేట్లు ఫిక్స్ చేశారు. ఇది సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆక్యుపెన్సీ పెరిగింది. విక్రమ్ మూవీకి ఇంకా తక్కువ రేట్లుండటంతో దానికీ ప్లస్ అయింది. ఇదే సమయంలో పక్కా కమర్షియల్ మూవీకి మరింత తక్కువ రేట్లు పెట్టనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇలా అందరూ రేట్లు తగ్గిస్తుంటే.. నాని సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 175, మల్టీప్లెక్సుల్లో 250 పెట్టడం ప్రేక్షకులకు రుచించడం లేదు. నాని సినిమాలను ఎక్కువగా దిగువ, మధ్యతరగతి జనాలే చూస్తారు. వాళ్లకు అందుబాటులో ఉండేలా ఇంకా రేట్లు తగ్గించాల్సిందని, అలా లేదు కాబట్టే అడ్వాన్స్ బుకింగ్స్ మీద ప్రభావం పడుతోందని అంటున్నారు.
This post was last modified on June 8, 2022 12:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…