సినిమాలతో పోటీ పడుతూ వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి డిజిటల్ సంస్థలు. క్యాస్టింగ్, క్వాలిటీ, టెక్నికల్ టీమ్ ఇలా ఏది తీసుకున్నా రాజీ అనే ప్రస్తావనే ఉండటం లేదు. ఏడాది చందా తీసుకున్న సబ్స్క్రైబర్స్ కు న్యాయం జరిగేలా కంటెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న సుడల్ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. సరే ఇలాంటివి బోలెడు వస్తాయి కదా ఇందులో ప్రత్యేకత ఏముందనే సందేహం కలుగుతోందా. అక్కడికే వద్దాం.
2017లో మాధవన్ విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన విక్రమ్ వేదా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తమిళం మీద అవగాహన ఉన్న వాళ్లకు బాగా తెలుసు. దీనికి దర్శకత్వం వహించింది భార్య భర్తలు పుష్కర్ గాయత్రి. వీళ్ళే ఇప్పుడు హిందీలో హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ తో దాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ ఆరేళ్ళ వీళ్ళు ఇంకే కొత్త సినిమా చేయలేదు. ఒక సిరీస్ కు స్క్రిప్ట్ రాసుకున్నారు. అదే ఈ సుడల్. కాకపోతే దర్శకత్వం బ్రహ్మ-అనుచరణ్ లకు అప్పగించారు.ట్రైలర్ కూడా వచ్చేసింది. జూన్ 17 దీని మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది.
తప్పిపోయిన తన చెల్లి కోసం వెతుకుతున్న అక్కకు ఓ గ్రామంలో ఉండే ఆచారాలు, అక్కడి ఫ్యాక్టరీ స్థితిగతులు బోలెడు అనుమానాలు రేకెత్తిస్తాయి. వాటిని దాటుకుని ఆమె జాడను ఎలా కనుక్కుందనేదే ఈ సుడల్ కథ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ పరంగా చాలా రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, కతిర్ లు ప్రధాన తారాగణం. అప్పుడెప్పుడో విశాల్ పొగరులో లేడీ విలన్ గా అదరగొట్టిన అతని వదిన శ్రేయ రెడ్డి ఓ కీలక పాత్ర చేశారు. ఇంత గ్రాండ్ స్కేల్ మీద వస్తున్న ఈ సుడల్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో..
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…