Movie News

అల్లు అర‌వింద్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం


అధిక టికెట్ ధ‌ర‌లు ప్రేక్ష‌కుల‌పై తీవ్ర ప్ర‌భావ‌మే చూపుతున్నాయ‌ని.. చాలామంది థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తున్నార‌ని, దీని వ‌ల్ల థియేట‌ర్ల ఉనికే ప్ర‌మాదంలో ప‌డ‌బోతోంద‌ని టాలీవుడ్ పెద్దలు అర్థం చేసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇటీవల ఎఫ్‌-3 సినిమాకు అద‌నంగా రేట్లు పెంచుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ దిల్ రాజు ఛాన్స్ తీసుకోలేదు. ఆ సినిమాకు సాధార‌ణ రేట్లే ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. కానీ సాధార‌ణ స్థాయిలో కూడా రేట్ల భారం ఎక్కువే ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌ను ఇంకా తగ్గిస్తే మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మేజ‌ర్ సినిమాకు మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ ధ‌ర‌ను రూ.195కి, సింగిల్ స్క్రీన్ల రేట్లు రూ.150కి ప‌రిమితం చేయ‌డం మంచి ఫ‌లితాన్నే ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ రేట్ల త‌గ్గింపు విష‌యంలో ఇంకా చొర‌వ తీసుకున్నారు. త‌న నిర్మాణంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌లు ఇంకా త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ భాగ‌స్వామి, అర‌వింద్ నిర్మాణ సంస్థ‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే బ‌న్నీ వాసు ప‌క్కా క‌మర్షియ‌ల్ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా త‌మ సినిమాకు పెట్ట‌బోయే టికెట్ల రేట్ల గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు.

తెలంగాణ‌లో జీఎస్టీతో క‌లిపితే మ‌ల్టీప్లెక్సుల్లో రూ.189, సింగిల్ స్క్రీన్ల‌లో రూ.112 రేటు ఉండ‌బోతోంది ఈ సినిమాకు. ఏపీలో ఈ రేట్లు వ‌రుస‌గా రూ.177, రూ.112 ఉండ‌బోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల ధ‌ర‌ను రూ.112 పెట్ట‌డం క‌చ్చితంగా సినిమాకు క‌లిసొచ్చేదే. ఈ రేటుతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య క‌చ్చితంగా పెరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి ఎప్పుడు తెచ్చే విష‌యం మీదా బ‌న్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. ఐదు వారాల్లోపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఓటీటీలో రాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

This post was last modified on June 4, 2022 7:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

23 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

1 hour ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago