Movie News

అల్లు అర‌వింద్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం


అధిక టికెట్ ధ‌ర‌లు ప్రేక్ష‌కుల‌పై తీవ్ర ప్ర‌భావ‌మే చూపుతున్నాయ‌ని.. చాలామంది థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తున్నార‌ని, దీని వ‌ల్ల థియేట‌ర్ల ఉనికే ప్ర‌మాదంలో ప‌డ‌బోతోంద‌ని టాలీవుడ్ పెద్దలు అర్థం చేసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇటీవల ఎఫ్‌-3 సినిమాకు అద‌నంగా రేట్లు పెంచుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ దిల్ రాజు ఛాన్స్ తీసుకోలేదు. ఆ సినిమాకు సాధార‌ణ రేట్లే ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. కానీ సాధార‌ణ స్థాయిలో కూడా రేట్ల భారం ఎక్కువే ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌ను ఇంకా తగ్గిస్తే మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మేజ‌ర్ సినిమాకు మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ ధ‌ర‌ను రూ.195కి, సింగిల్ స్క్రీన్ల రేట్లు రూ.150కి ప‌రిమితం చేయ‌డం మంచి ఫ‌లితాన్నే ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ రేట్ల త‌గ్గింపు విష‌యంలో ఇంకా చొర‌వ తీసుకున్నారు. త‌న నిర్మాణంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌లు ఇంకా త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ భాగ‌స్వామి, అర‌వింద్ నిర్మాణ సంస్థ‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే బ‌న్నీ వాసు ప‌క్కా క‌మర్షియ‌ల్ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా త‌మ సినిమాకు పెట్ట‌బోయే టికెట్ల రేట్ల గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు.

తెలంగాణ‌లో జీఎస్టీతో క‌లిపితే మ‌ల్టీప్లెక్సుల్లో రూ.189, సింగిల్ స్క్రీన్ల‌లో రూ.112 రేటు ఉండ‌బోతోంది ఈ సినిమాకు. ఏపీలో ఈ రేట్లు వ‌రుస‌గా రూ.177, రూ.112 ఉండ‌బోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల ధ‌ర‌ను రూ.112 పెట్ట‌డం క‌చ్చితంగా సినిమాకు క‌లిసొచ్చేదే. ఈ రేటుతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య క‌చ్చితంగా పెరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి ఎప్పుడు తెచ్చే విష‌యం మీదా బ‌న్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. ఐదు వారాల్లోపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఓటీటీలో రాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

This post was last modified on June 4, 2022 7:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

44 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago