Movie News

అల్లు అర‌వింద్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం


అధిక టికెట్ ధ‌ర‌లు ప్రేక్ష‌కుల‌పై తీవ్ర ప్ర‌భావ‌మే చూపుతున్నాయ‌ని.. చాలామంది థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తున్నార‌ని, దీని వ‌ల్ల థియేట‌ర్ల ఉనికే ప్ర‌మాదంలో ప‌డ‌బోతోంద‌ని టాలీవుడ్ పెద్దలు అర్థం చేసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఇటీవల ఎఫ్‌-3 సినిమాకు అద‌నంగా రేట్లు పెంచుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ దిల్ రాజు ఛాన్స్ తీసుకోలేదు. ఆ సినిమాకు సాధార‌ణ రేట్లే ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. కానీ సాధార‌ణ స్థాయిలో కూడా రేట్ల భారం ఎక్కువే ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న రేట్ల‌ను ఇంకా తగ్గిస్తే మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మేజ‌ర్ సినిమాకు మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ ధ‌ర‌ను రూ.195కి, సింగిల్ స్క్రీన్ల రేట్లు రూ.150కి ప‌రిమితం చేయ‌డం మంచి ఫ‌లితాన్నే ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ రేట్ల త‌గ్గింపు విష‌యంలో ఇంకా చొర‌వ తీసుకున్నారు. త‌న నిర్మాణంలో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు టికెట్ల ధ‌ర‌లు ఇంకా త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ భాగ‌స్వామి, అర‌వింద్ నిర్మాణ సంస్థ‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే బ‌న్నీ వాసు ప‌క్కా క‌మర్షియ‌ల్ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా త‌మ సినిమాకు పెట్ట‌బోయే టికెట్ల రేట్ల గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు.

తెలంగాణ‌లో జీఎస్టీతో క‌లిపితే మ‌ల్టీప్లెక్సుల్లో రూ.189, సింగిల్ స్క్రీన్ల‌లో రూ.112 రేటు ఉండ‌బోతోంది ఈ సినిమాకు. ఏపీలో ఈ రేట్లు వ‌రుస‌గా రూ.177, రూ.112 ఉండ‌బోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల ధ‌ర‌ను రూ.112 పెట్ట‌డం క‌చ్చితంగా సినిమాకు క‌లిసొచ్చేదే. ఈ రేటుతో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య క‌చ్చితంగా పెరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి ఎప్పుడు తెచ్చే విష‌యం మీదా బ‌న్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు. ఐదు వారాల్లోపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఓటీటీలో రాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

Satya

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

1 hour ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

3 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

3 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

3 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

4 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

5 hours ago