బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సయీ. అయితే ఆ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ కి చేదు అనుభవం మిగిల్చింది. సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ సినిమా చేస్తుండగానే అడివి శేష్ ‘మేజర్’ లో చాన్స్ కొట్టేసింది సయీ. ఇప్పుడు మేజర్ మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో మరింత బిజీ అవ్వాలని చూస్తుంది.
నిజానికి మేజర్ లో సయీ కనిపించేది కాసేపే. ఆమెకు కథలో స్పేస్ చాలా తక్కువే. అయినా హీరోయిన్ పాత్ర కాబట్టి ఉన్న కాసేపు పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజజీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఇప్పటి వరకూ చాలా ప్రీమియర్స్ వేశారు. భారీ ఏమి రాలేదు కానీ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అనే స్టాంప్ మాత్రం దక్కించుకుంది.
ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నార్త్ ఆడియన్స్ కి సినిమా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.మేజర్ కి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఈ అమ్మడుకి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం. మరి సయీ కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on June 2, 2022 5:08 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…