బాలీవుడ్ బ్యూటీ ఆశలన్నీ మేజర్ మీదే

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సయీ. అయితే ఆ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ కి చేదు అనుభవం మిగిల్చింది. సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ సినిమా చేస్తుండగానే అడివి శేష్ ‘మేజర్’ లో చాన్స్ కొట్టేసింది సయీ. ఇప్పుడు మేజర్ మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో మరింత బిజీ అవ్వాలని చూస్తుంది.

నిజానికి మేజర్ లో సయీ కనిపించేది కాసేపే. ఆమెకు కథలో స్పేస్ చాలా తక్కువే. అయినా హీరోయిన్ పాత్ర కాబట్టి ఉన్న కాసేపు పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజజీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఇప్పటి వరకూ చాలా ప్రీమియర్స్ వేశారు. భారీ ఏమి రాలేదు కానీ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అనే స్టాంప్ మాత్రం దక్కించుకుంది.

ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నార్త్ ఆడియన్స్ కి సినిమా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.మేజర్ కి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఈ అమ్మడుకి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం. మరి సయీ కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.