Movie News

మాట నిలబెట్టుకున్న సుశాంత్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంత మంచివాడో ఒక్కొక్కరుగా బాలీవుడ్ సెలబ్రెటీలు చెప్పుకొస్తుంటే.. అతడి అభిమానుల బాధ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. తాజాగా సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచరా’ దర్శకుడు ముకేష్ చబ్రా తన హీరో గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. ముకేష్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

అతణ్ని దర్శకుణ్ని చేస్తానని సుశాంత్ ఎన్నో ఏళ్ల కిందట మాట ఇచ్చి.. ఇప్పుడు అన్నట్లుగానే తన సినిమాతోనే దర్శకుణ్ని చేశాడట. వీళ్లిద్దరి పరిచయం ఈనాటిది కాదు. సుశాంత్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కై పో చే’ నుంచే ఇద్దరూ కలిసి సాగుతున్నారట. ఆ చిత్రానికి ముకేష్ దర్శకత్వ శాఖలో పని చేశాడట. అప్పట్నుంచి ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని.. తనను అతను ఎంతగానో ప్రోత్సహించాడని.. ఎప్పటికైనా దర్శకుడిగా తొలి సినిమా తనతోనే ఉంటుందని చెప్పాడని.. ఆ హామీని నిలబెట్టుకుంటూ ‘దిల్ బేచరా’తో తనను డైరెక్టర్ని చేశాడని ముకేష్ వెల్లడించాడు.

సుశాంత్ కేవలం తన తొలి చిత్ర కథానాయకుడే కాదని.. అతను ప్రియమైన స్నేహితుడు కూడా అని.. తన కష్టాల్లో, సుఖాల్లో అన్నింట్లో తనకు తోడుగా ఉన్నాడని చెప్పాడు ముకేష్. తామిద్దరం కలిసి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నామని.. కలిసి ఎన్నో కలలు కన్నామని.. కానీ తన తొలి చిత్రం సుశాంత్ లేకుండా రిలీజవుతుందని ఎప్పుడూ అనుకోలేదని ముకేష్ అన్నాడు.

అతడి ప్రేమే ఇప్పుడు ‘దిల్ బేచరా’ సినిమాను రిలీజ్ చేసే విషయంలో గైడ్ చేస్తోందని.. ఆ సినిమాను ప్రతి ఒక్కరూ చూసేలా నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముకేష్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా సుశాంత్ పై నుంచి తన అందమైన నవ్వుతో తామందరినీ ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నట్లు ముకేష్ చెప్పాడు. ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ నిర్మించిన ‘దిల్ బేచరా’ వచ్చే నెల 24 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానున్నట్లు నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on June 26, 2020 3:15 pm

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

37 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

46 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

1 hour ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago