ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. ముఖ్యంగా 2000వ సంవత్సరం నాటి యూత్ అయితే ఈ పేరును ఎంతగా ఇష్టపడ్డారో చెప్పడం కష్టం. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుసగా మూడు సెన్సేషనల్ సినిమాలతో అతను ప్రేక్షకుల్లో గుండెల్లోకి దూసుకెళ్లిపోయాడు. ఈ మూడు చిత్రాలూ బడ్జెట్ మీద పది రెట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. దీన్ని బట్టి అవెంత బ్లాక్బస్టర్లో అర్థం చేసుకోవచ్చు. అప్పటి కుర్రాళ్లందరూ ఉదయ్లో తమను తాము చూసుకున్నారు.
అమ్మాయిలందరూ ఉదయ్ లాంటి వాడు తమ జీవితంలోకి రావాలని కోరుకున్నారు. పెద్దవాళ్లను కూడా అమితంగా ఆకట్టుకున్న ఉదయ్.. ఆ తర్వాతి కాలంలో ఆశించిన విజయాలందుకోలేకపోయాడు. కొన్నేళ్ల తర్వాత లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు.
కట్ చేస్తే.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని అందరినీ విషాదంలో ముంచెత్తాడు. ఇప్పటికీ ఉదయ్ అభిమానుల్ని ఆ బాధ వెంటాడుతోంది. మొన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడితే మన వాళ్లందరికీ ఉదయ్ కిరణ్ గుర్తుకొచ్చాడు. సుశాంత్తో చాలా రకాలుగా ఉదయ్కు పోలికలుండటమే అందుక్కారణం.
ఉదయ్కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగానే గురువారం అతడి పుట్టిన రోజు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగుతోంది. హైదరాబాద్లోనే కాదు.. ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది ఉదయ్ పేరు. అతడి సినిమాలు.. పాత్రల్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఉద్వేగానికి గురవుతున్నారు.
ఉదయ్ కెరీర్ ఆరంభంలో ఒక్కో సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్లతో ఉదయ్ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు. ఇదంతా చూస్తే ఉదయ్ మీద ఇప్పటికీ జనాలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.
This post was last modified on June 26, 2020 5:16 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…