Movie News

మాస్ దర్శకుడికి నాగార్జున పిలుపు

ప్రస్తుతం ది ఘోస్ట్ షూటింగ్ లో ఉన్న అక్కినేని నాగార్జున తర్వాత ఎవరితో చేయబోతున్నారనే క్లారిటీ ఇంకా రాలేదు. ఖాళీ సమయాన్ని బిగ్ బాస్ షో కోసం వాడుకున్న అక్కినేని హీరో ప్రస్తుతం ఓ మాస్ దర్శకుడికి కథ వినేందుకు ఓకే చెప్పారట. సంపత్ నంది చెప్పిన ఒక లైన్ నచ్చడంతో దాని ఫుల్ వెర్షన్ చూశాక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్.

బంగార్రాజు సక్సెస్ తర్వాత తనకు మాస్ లో ఇమేజ్ పూర్తిగా తగ్గలేదని గుర్తించిన నాగ్ దాన్ని మరింత బలోపేతం చేసే ప్లాన్లో ఇలా ఆలోచిస్తున్నారని తెలిసింది. సంపత్ నందికి ఎంత మాస్ పల్స్ మీద పట్టున్నా కూడా రచ్చ తర్వాత దాని స్థాయిలో పెద్ద హిట్టు కొట్టలేదు. బెంగాల్ టైగర్ యావరేజ్ గా నిలవగా గౌతమ్ నందా ఫ్లాప్ అయ్యింది. రెండూ భారీ బడ్జెట్ లతో రూపొందినవే.

సరే పోన్లేమ్మని గోపీచంద్ సీటిమార్ రూపంలో మరో అవకాశం ఇస్తే అదీ సోసో ఫలితాన్నే ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకున్న చోటా మేస్త్రీ పూర్తిగా పక్కకెళ్లిపోయిందని వినికిడి. ప్రస్తుతం సంపత్ కథలు అందించి నిర్మాణ భాగస్వామ్యం వహించిన బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి.

ఇక నాగార్జున విషయానికి వస్తే ఆఫీసర్, వైల్డ్ డాగ్, మన్మథుడు 2 లాంటి రాంగ్ సెలక్షన్ వల్ల అటు క్లాస్ ఇటు మాస్ ఇద్దరినీ మెప్పించలేక డిజాస్టర్స్ కొనితెచ్చుకున్నారు. సంక్రాంతి సీజన్ వల్ల బంగార్రాజు కాస్త బెటర్ గా ఆడింది కానీ పోటీ ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఒకప్పుడు అల్లరి అల్లుడు, వారసుడు. ఘరానా బుల్లోడు లాంటి కమర్షియల్ హిట్స్ పడాలంటే సంపత్ నంది లాంటి వాళ్ళైతేనే కరెక్టనేది కింగ్ అభిప్రాయం కావొచ్చు. మరి ప్రవీణ్ సత్తారు, కళ్యాణ్ కృష్ణలాగా ఇతనూ నాగ్ ను ఎలా ఒప్పించుకుంటాడో చూడాలి. 

This post was last modified on May 31, 2022 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

3 minutes ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

1 hour ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

1 hour ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

5 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

8 hours ago