విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన నాగ చైతన్య మళ్ళీ అదే దర్శకుడితో ‘ధూత’ అనే సిరీస్ చేస్తున్నాడు. OTT ఫ్లాట్ ఫాం కోసం చైతూ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఆ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
చైతూ నెక్స్ట్ లిస్టులో కిషోర్ తిరుమల , రాహుల్ సంక్రిత్యాన్ , విజయ్ కనక మేడల ఇలా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరితో కాకుండా నెక్స్ట్ పరశురాం తో ‘నాగేశ్వరరావు’ అనే ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు చైతు.
తాజాగా మహేష్ తో ‘సర్కారు వారి పాట’ తీసిన పరశురాం చైతూ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది కనుక త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ‘నాగేశ్వరరావు’ సినిమా తర్వాత చైతు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దర్శకుడిగా గ్యాప్ తీసుకొని నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ చైతూ కోసం ఓ బ్యూటిఫుల్ స్టోరీ రాసుకున్నాడట.
చైతూ నెక్స్ట్ లిస్టులో ‘నాంది’ దర్శకుడు విజయ్ కనక మేడల లేనట్టే అంటున్నారు. కిషోర్ తిరుమలతో కూడా ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తుంది. కమిట్ అయిన సినిమాల గ్యాప్ లో రాహుల్ సంక్రిత్యన్ కి మాత్రం చైతు చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అక్కినేని కుర్ర హీరో అరడజను సినిమాలతో భారీ లైనప్ పెట్టుకున్నాడు. అందులో తనకి పక్కాగా హిట్టిచ్చే దర్శకులతో ముందుగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.
This post was last modified on May 30, 2022 11:45 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…