యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ ఇప్పుడంత ఊపులో ఏమీ లేదు. కొవిడ్ కారణంగా అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. అంతకుముందు ‘అర్జున్ సురవరం’ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. మిగతా సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. అయినా సరే.. నిఖిల్కు అవకాశాల విషయంలో ఏమీ ఢోకా లేదు. క్రేజీ ప్రాజెక్టులతో వరుసగా బాక్సాఫీస్ మీద ఎటాక్ చేయడానికి అతను సిద్ధమవుతున్నాడు.
సుకుమార్ కథతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించిన ‘18 పేజెస్’తో అతను మళ్లీ థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాడు. జూన్లోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అది రిలీజైన నెల రోజుల్లోపే ‘కార్తికేయ-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నిఖిల్. యువ దర్శకుడు చందు మొండేటితో నిఖిల్ చేసిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. నిఖిల్ కెరీర్లో ఏ రకంగా చూసినా అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.
అప్పట్లో అది అతడికి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంత పెద్ద హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో ‘కార్తికేయ-2’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాకు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లాంటి పెద్ద నిర్మాతలు దొరకడంతో బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఐతే పాన్ ఇండియా రిలీజ్ అంటే ఏదో నామమాత్రంగా కాకుండా పకడ్బందీగానే చేస్తున్నారు.
ఈ సినిమా ఎక్కువగా ఉత్తరాదినే షూటింగ్ జరుపుకోవడం విశేషం. కొంతమేర విదేశాల్లో కూడా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో నిఖిల్ స్వయంగా హిందీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘హైదరాబాద్ నవాబ్స్’ లాంటి సినిమాల్లో నిఖిల్ హిందీలోనే డైలాగులు చెప్పాడు. అతడికి హిందీపై బాగానే పట్టుంది. ‘కార్తికేయ-2’ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండటంతో స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. ‘కశ్మీర్ ఫైల్స్’తో ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయిన అభిషేక్ అగర్వాల్ పెద్ద రేంజిలో సినిమాను నార్త్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on May 25, 2022 1:30 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…