కన్నడ చలన చిత్ర చరిత్రలో ఎవరూ అందుకోలేని విధంగా 1200 కోట్ల వసూళ్లతో టాప్ వన్ హిట్ సాధించిన కెజిఎఫ్ హీరో యష్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. పూరి జగన్నాధ్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తిదే. దర్శకులు నిర్మాతలు ఎందరు కలుస్తున్నా యష్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడేసరికి ఏం చేయాలో తెలియని ఒత్తిడిలో ఉన్నాడని అందుకే లేట్ చేస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు కానీ శాండల్ వుడ్ టాక్ ప్రకారం కథ వేరే ఉంది
యష్ కు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాతృబాష అంటే విపరీతమైన మక్కువ. అందుకే సినిమా ఏదైనా సరే అది కన్నడలోనే తీసి జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలనేది ఆలోచన. కానీ కెజిఎఫ్ కు ముందు యష్ వేరు. ఇప్పుడు తనకొచ్చిన స్టార్ డం వేరు. దీన్ని బ్యాలన్స్ చేసేంత సత్తా ఉన్న దర్శకులు అక్కడ లేరు. పైగా మార్కెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని రిస్క్ లేకుండా స్క్రిప్టులు రాసుకునే వాళ్లకు ఒక్కసారిగా ప్యాన్ ఇండియా సబ్జెక్టులు రెడీ చేయమంటే అంత సులభం కాదు. అందుకే ఈ ఆలస్యం.
యష్ తనదగ్గరికొచ్చిన టాలీవుడ్ బాలీవుడ్ దర్శకులకు స్పందించకపోవడం సరికాదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా తన రేంజ్ పెంచుకునే ఉద్దేశంతో లోకల్ ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లకు కమిటైపోయాడు. నెక్స్ట్ రామ్ చరణ్ లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ కలిపితే వేల కోట్లతో ముడిపడిన ప్రాజెక్టులు. కానీ యష్ అలా ఆలోచించకుండా కన్నడవాళ్ళతోనే చేస్తాను ఇక్కడే ఉంటాను అంటే ఇబ్బందవుతుంది. కొంచెం ప్రాక్టికల్ గా అలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…