కన్నడ చలన చిత్ర చరిత్రలో ఎవరూ అందుకోలేని విధంగా 1200 కోట్ల వసూళ్లతో టాప్ వన్ హిట్ సాధించిన కెజిఎఫ్ హీరో యష్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. పూరి జగన్నాధ్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తిదే. దర్శకులు నిర్మాతలు ఎందరు కలుస్తున్నా యష్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడేసరికి ఏం చేయాలో తెలియని ఒత్తిడిలో ఉన్నాడని అందుకే లేట్ చేస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు కానీ శాండల్ వుడ్ టాక్ ప్రకారం కథ వేరే ఉంది
యష్ కు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాతృబాష అంటే విపరీతమైన మక్కువ. అందుకే సినిమా ఏదైనా సరే అది కన్నడలోనే తీసి జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలనేది ఆలోచన. కానీ కెజిఎఫ్ కు ముందు యష్ వేరు. ఇప్పుడు తనకొచ్చిన స్టార్ డం వేరు. దీన్ని బ్యాలన్స్ చేసేంత సత్తా ఉన్న దర్శకులు అక్కడ లేరు. పైగా మార్కెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని రిస్క్ లేకుండా స్క్రిప్టులు రాసుకునే వాళ్లకు ఒక్కసారిగా ప్యాన్ ఇండియా సబ్జెక్టులు రెడీ చేయమంటే అంత సులభం కాదు. అందుకే ఈ ఆలస్యం.
యష్ తనదగ్గరికొచ్చిన టాలీవుడ్ బాలీవుడ్ దర్శకులకు స్పందించకపోవడం సరికాదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా తన రేంజ్ పెంచుకునే ఉద్దేశంతో లోకల్ ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లకు కమిటైపోయాడు. నెక్స్ట్ రామ్ చరణ్ లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ కలిపితే వేల కోట్లతో ముడిపడిన ప్రాజెక్టులు. కానీ యష్ అలా ఆలోచించకుండా కన్నడవాళ్ళతోనే చేస్తాను ఇక్కడే ఉంటాను అంటే ఇబ్బందవుతుంది. కొంచెం ప్రాక్టికల్ గా అలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్.
This post was last modified on May 25, 2022 11:51 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…