పాపం రాజశేఖర్.. కెరీర్ అసలే అంతంతమాత్రంగా ఉంటే.. ఆయన కొత్త సినిమా శేఖర్ కూడా ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఒకప్పుడు అంకుశం, అల్లరి ప్రియుడు లాంటి భారీ విజయాలతో టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్.. ఇప్పుడు తన సినిమాను ఆదరించి తన బతుకుదెరువును కాపాడాలని, ఈ సినిమా ఆడకుంటే తాను అప్పుల పాలైపోతానని ప్రేక్షకులను వేడుకున్నాడంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒక దశలో జీరో అయిపోయిన రాజశేఖర్ మార్కెట్ను మధ్యలో గరుడ వేగ సినిమా కాస్త పైకి లేపినట్లు అనిపించింది. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన కల్కికి మంచి క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలో విషయం లేకపోవడం, తర్వాత బాగా గ్యాప్ వచ్చేయడం, శేఖర్ సినిమాకు ఏ దశలోనూ బజ్ తీసుకురాలేకపోవడంతో రాజశేఖర్కు బాక్సాఫీస్ దగ్గర గడ్డు పరిస్థితులు తప్పలేదు.
ఈ రోజుల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం పెద్ద సవాలుగా మారిపోయింది. ఇలాంటి టైంలో ఏమాత్రం బజ్ లేకుండా శేఖర్ సినిమా రిలీజైంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆడే పరిస్థితి లేదు. అలాంటిది సినిమాకు టాక్ సరిగా లేదు. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. మినిమం ఆక్యుపెన్సీ కనిపించలేదు. రాజశేఖర్ అంతగా తన పరిస్థితి చెప్పుకున్నా, విన్నవించినా ఆయన అభిమానుల్లో, సగటు ప్రేక్షకుల్లో పెద్దగా స్పందన లేదు. ఇక టాక్ బాగా లేకపోయేసరికి సినిమా చల్లబడిపోయింది. శనివారం కూడా ఈ సినిమాకు ఆశించిన స్పందన లేదు.
దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు.. ఫైనాన్స్ గొడవల వల్ల ఆదివారం సాయంత్రం నుంచి సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నిజానికి సినిమాను కొనసాగించి ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. సోమవారం నుంచి థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి థియేట్రికల్ రన్ ఆగిపోయిందని బాధపడ్డానికేమీ లేదు. ఇప్పుడిక రాజశేఖర్ ఫ్యామిలీ చేయాల్సిందల్లా. ఈ వివాదాన్ని పరిష్కరించుకుని ఓటీటీ నుంచైనా చెప్పుకోదగ్గ డీల్ రాబట్టుకోవడమే.
This post was last modified on May 23, 2022 6:25 am
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…