తాము నటించిన సినిమా మీద హీరోలకు నటీనటులకు కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పు లేదు. కానీ దాని ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా చాలు సోషల్ మీడియా ట్రోలింగ్ తో నెటిజెన్లు ఆడేసుకుంటారు. ఆ మధ్య విశ్వక్ సేన్ పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి మాటలే చెప్పి అనవసరంగా ట్రిగ్గర్ అయ్యాడని అందరూ అనుకున్నారు కానీ అది నిజంగానే ఓపెనింగ్స్ కి ఉపయోగపడింది. కాకపోతే పాగల్ ఫ్లాప్ అయితే పేరు మార్చుకుంటానని చేసిన శపథం తర్వాత తూచ్ అనేశాడు. వసూళ్లు వచ్చాయి కదాని దాటేశాడు.
ఇదే తరహా స్టేజిపై మాటలు శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరు కుర్ర హీరోలు చేశారు. సరే వాళ్లంటే యూత్ బ్లడ్ కాబట్టి అనుకోవచ్చు. కానీ ఎఫ్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా కనక విజయం సాధించకపోతే ఇక మీ ముందుకు రానని అనేశారు. దీంతో అందరూ షాక్. చాలా నమ్మకం ఉంటేనే అలా అంటారు నిజమే. కానీ ఇలా ముందస్తుగా ఇలా చెప్పేసి రేపు ఏ మాత్రం అటుఇటు అయినా సరే అనవసరంగా మంచి పేరున్న రాజేంద్రుడు ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో టార్గెట్ అవుతారు.
మొత్తానికి ఎఫ్3 మీద టీమ్ వ్యక్తం చేస్తున్న నమ్మకం చూస్తుంటే హిట్టు కళ కనిపిస్తోంది. కాకపోతే బాక్సాఫీస్ ఫలితాలను ఎవరూ అంత ఈజీగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ఆర్ ని దేశవ్యాప్తంగా కెజిఎఫ్ 2 దాటడం అనూహ్యంగా జరిగింది. సర్కారు వారి పాటకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా 100 కోట్ల షేర్ దాటిందని నిర్మాతలే చెప్పుకుంటున్నారు. రాజమౌళి నెగటివ్ సెంటిమెంట్ ని ఆచార్య బ్రేక్ చేసే తీరుతుందని చిరంజీవి అన్న మాటలు తుస్సుమన్నాయి. మరి రాజేంద్రుడు అన్నవి ఏమవుతాయో చూడాలి.
This post was last modified on May 22, 2022 7:28 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…