ఆచార్య డిజాస్టర్ తాలూకు గాయం నుంచి మెగాభిమానులు బయట పడలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇండియా గర్వపడే సినిమా వచ్చాక ఇలాంటి ఫలితం దక్కడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అన్యాయంగా ఓటిటిలో కూడా ఎవరూ పట్టించుకోకపోవడం మరింత బాధ పెడుతోంది. టీవీలో ఓసారైనా చూడొచ్చని సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు పోస్టు పెడితే ఒట్టు. అందుకే చిరంజీవికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 రేంజ్ లో ఒక సూపర్ హిట్ అవసరం. ఈ కారణంగానే ఫ్యాన్స్ కళ్ళు గాడ్ ఫాదర్ మీద ఉన్నాయి.
మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ భాగం కూడా పూర్తి చేశారు. నయనతార తన పార్ట్ ని ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకుందట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే బాలన్స్ ఉన్న పనులన్నీ చకచకా కొలిక్కి తెస్తారు. ఆగస్ట్ 11 లేదా 12 విడుదల చేసే ఆలోచనను నిర్మాతలు సీరియస్ గా చేస్తున్నారని టాక్. లాల్ సింగ్ చద్దా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గం, యశోదలు ఉన్నప్పటికీ అవేవి కేర్ చేసే స్థితిలో లేరని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.
అదే నిజమైతే ఇంకో రెండున్నర నెలల్లోనే చిరు మరోసారి తెరపై చూడొచ్చు. అనంతపూర్ వేదికగా ఆగస్ట్ రెండో వారంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదనను చిరు ఆల్మోస్ట్ ఓకే చేశారని వినికిడి. మీడియాకు అఫీషియల్ గా ఎలాంటి బైట్స్ ఇవ్వకపోయినా జూలై నుంచి క్రమం తప్పకుండా ప్రమోషన్ చేసి ఆచార్యకు జరిగిన పబ్లిసిటీ పొరపాట్లు దీనికి రిపీట్ కాకుండా చూసుకుంటారట. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే అంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ప్రేక్షకుల నుంచి ఇంకేముంటుంది.
This post was last modified on May 22, 2022 7:04 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…