ఆచార్య డిజాస్టర్ తాలూకు గాయం నుంచి మెగాభిమానులు బయట పడలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇండియా గర్వపడే సినిమా వచ్చాక ఇలాంటి ఫలితం దక్కడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అన్యాయంగా ఓటిటిలో కూడా ఎవరూ పట్టించుకోకపోవడం మరింత బాధ పెడుతోంది. టీవీలో ఓసారైనా చూడొచ్చని సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు పోస్టు పెడితే ఒట్టు. అందుకే చిరంజీవికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 రేంజ్ లో ఒక సూపర్ హిట్ అవసరం. ఈ కారణంగానే ఫ్యాన్స్ కళ్ళు గాడ్ ఫాదర్ మీద ఉన్నాయి.
మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ భాగం కూడా పూర్తి చేశారు. నయనతార తన పార్ట్ ని ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకుందట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే బాలన్స్ ఉన్న పనులన్నీ చకచకా కొలిక్కి తెస్తారు. ఆగస్ట్ 11 లేదా 12 విడుదల చేసే ఆలోచనను నిర్మాతలు సీరియస్ గా చేస్తున్నారని టాక్. లాల్ సింగ్ చద్దా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గం, యశోదలు ఉన్నప్పటికీ అవేవి కేర్ చేసే స్థితిలో లేరని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.
అదే నిజమైతే ఇంకో రెండున్నర నెలల్లోనే చిరు మరోసారి తెరపై చూడొచ్చు. అనంతపూర్ వేదికగా ఆగస్ట్ రెండో వారంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదనను చిరు ఆల్మోస్ట్ ఓకే చేశారని వినికిడి. మీడియాకు అఫీషియల్ గా ఎలాంటి బైట్స్ ఇవ్వకపోయినా జూలై నుంచి క్రమం తప్పకుండా ప్రమోషన్ చేసి ఆచార్యకు జరిగిన పబ్లిసిటీ పొరపాట్లు దీనికి రిపీట్ కాకుండా చూసుకుంటారట. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే అంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ప్రేక్షకుల నుంచి ఇంకేముంటుంది.
This post was last modified on May 22, 2022 7:04 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…