ఆచార్య డిజాస్టర్ తాలూకు గాయం నుంచి మెగాభిమానులు బయట పడలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇండియా గర్వపడే సినిమా వచ్చాక ఇలాంటి ఫలితం దక్కడం జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ అన్యాయంగా ఓటిటిలో కూడా ఎవరూ పట్టించుకోకపోవడం మరింత బాధ పెడుతోంది. టీవీలో ఓసారైనా చూడొచ్చని సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు పోస్టు పెడితే ఒట్టు. అందుకే చిరంజీవికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 రేంజ్ లో ఒక సూపర్ హిట్ అవసరం. ఈ కారణంగానే ఫ్యాన్స్ కళ్ళు గాడ్ ఫాదర్ మీద ఉన్నాయి.
మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ భాగం కూడా పూర్తి చేశారు. నయనతార తన పార్ట్ ని ఫినిష్ చేశాకే బ్రేక్ తీసుకుందట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే బాలన్స్ ఉన్న పనులన్నీ చకచకా కొలిక్కి తెస్తారు. ఆగస్ట్ 11 లేదా 12 విడుదల చేసే ఆలోచనను నిర్మాతలు సీరియస్ గా చేస్తున్నారని టాక్. లాల్ సింగ్ చద్దా, కోబ్రా, మాచర్ల నియోజకవర్గం, యశోదలు ఉన్నప్పటికీ అవేవి కేర్ చేసే స్థితిలో లేరని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట.
అదే నిజమైతే ఇంకో రెండున్నర నెలల్లోనే చిరు మరోసారి తెరపై చూడొచ్చు. అనంతపూర్ వేదికగా ఆగస్ట్ రెండో వారంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదనను చిరు ఆల్మోస్ట్ ఓకే చేశారని వినికిడి. మీడియాకు అఫీషియల్ గా ఎలాంటి బైట్స్ ఇవ్వకపోయినా జూలై నుంచి క్రమం తప్పకుండా ప్రమోషన్ చేసి ఆచార్యకు జరిగిన పబ్లిసిటీ పొరపాట్లు దీనికి రిపీట్ కాకుండా చూసుకుంటారట. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే అంతకన్నా బర్త్ డే గిఫ్ట్ ప్రేక్షకుల నుంచి ఇంకేముంటుంది.
This post was last modified on May 22, 2022 7:04 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…