కొన్నిసార్లు ప్రేక్షకులు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల బయటి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుని సినిమాలకు ఫలితాలు కట్టబెడుతుంటారు. బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొస్తున్నపుడు మరీ అతి చేస్తే.. పరిస్థితులు ఎదురు తిరిగినపుడు బొక్క బోర్లా పడాల్సి వస్తుంది.
ఇప్పుడు కంగనా రనౌత్ పరిస్థితి ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది. ఆమె కొత్త చిత్రం ‘ధాకడ్’కు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేట్లు లేదు. ఈ సినిమా గురించి కంగనా చెప్పుకున్న గొప్పలు అన్నీ ఇన్నీ కావు. హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమాల తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రంతో ఇండియాలో తనకు ‘సూపర్ ఉమన్’ తరహా ఇమేజ్ వచ్చేస్తుందని కంగనా భావించింది.
ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హెలికాఫ్టర్లలో తిరుగుతూ.. మీడియా ముందు తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చాలా అతే చేసింది కంగనా. ‘మణికర్ణిక’ టైంలో దర్శకుడు క్రిష్ను అవమానించి.. ఆ సినిమా క్రెడిట్ అంతా తనదే అన్నట్లు పోజులు కొట్టడం.. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల్లో శ్రుతి మించి మాట్లాడటం.. తమ పాటికి తాము ఉన్న బాలీవుడ్ సెలబ్రెటీలను కెలికి మరీ వాళ్లను కించపరిచేలా మాట్లాడ్డం.. ఇలా చాలానే చేసింది కంగనా.
ఐతే ఇవన్నీ దృష్టిలో ఉంచుకునో ఏమో.. ప్రేక్షకులు ఆమె సినిమాను అసలు పట్టించుకోవట్లేదు. తొలి రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ వసూల్లు రూ.50 లక్షలే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. కంగనాకు ఇంతకంటే పరాభవం ఇంకోటి లేనట్లే. ‘మణికర్ణిక’ సహా కొన్ని విజయాలతో తాను స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోనట్లుగా మాట్లాడేది కంగనా.
ఆ తలబిరుసుతోనే అనేక కాంట్రవర్శల్ కామెంట్లు చేసింది. కానీ ఇప్పుడు ఆమె సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇంత దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్లో సినిమా రూ.5 కోట్లు కూడా వసూలు చేసేలా లేదు. అందులోనూ ‘భూల్ భూలయియా-2’ లాంటి ఎంటర్టైనర్తో కంగనా సినిమా పోటీ పడింది. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక దాని ముందు కంగనా సినిమా నిలవడం చాలా కష్టమే.
This post was last modified on May 21, 2022 3:39 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…