టీనేజీలోనూ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాలతో అతడికి వచ్చిన మాస్ ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. కానీ తర్వాత ఆ స్థాయి విజయాలు దక్కక అతను కొంచెం వెనుకబడ్డాడు. ఒక దశలో వరుస పరాజయాలతో అతడి కెరీర్ బాగా స్లో అయింది కూడా. కానీ టెంపర్ దగ్గర్నుంచి పుంజుకుని నిలకడగా విజయాలు అందుకుంటున్నాడు. మూడున్నరేళ్ల కిందట అరవింద సమేతతో కెరీర్లో మంచి హిట్ కొట్టి.. తాజాగా ఆర్ఆర్ఆర్తో రికార్డు హిట్లో భాగం అయ్యాడు.
ఐతే తారక్ వరుసగా విజయాలు సాధిస్తున్నా, సినిమా సినిమాకూ ఎదుగుతున్నా.. అభిమానుల్లో కొంత అసంతృప్తి లేకపోలేదు. అందుక్కారణం.. తారక్ స్టామినాకు తగ్గ మాస్ సినిమా పడకపోవడమే. ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఆ మాస్నే అతను మిస్ అయిపోతున్నాడన్నది వాళ్ల బాధ.
అరవింద సమేతలో కొంత వరకే మాస్ ఉంటుంది. మిగతా అంతా క్లాస్గా సాగిపోతుంది. ఆర్ఆర్ఆర్ అంటే అది వేరే వ్యవహారం. అందులో మాస్ కోణంలో చూస్తే తారక్కు రావాల్సినంత ఎలివేషన్ రాలేదన్న ఫీలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తారక్ పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేయాలని, తన స్టామినా మొత్తం తెరపై చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే ఇప్పుడు తారక్ సరిగ్గా అలాంటి సినిమాలే లైన్లో పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
తారక్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన రెండు సినిమాల గ్లింప్స్ చూస్తే మాస్కు ఇవి పూనకాలు తెప్పించేలాగే కనిపిస్తున్నాయి. తారక్తో తన సినిమా పూర్తి స్థాయి మాస్గా ఉంటుందని కొరటాల ముందే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు టీజర్ చూశాక అతను చెప్పినదానికంటే మాస్గా కనిపించింది. ఇక ప్రశాంత్ నీల్ సంగతి అసలు చెప్పాల్సిన పనే లేదు. ప్రి లుక్, దాని గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తే ఇది కూడా ఊర మాస్గా ఉంటుందనే అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో తారక్ మరోసారి తిరుగులేని మాస్ హీరోగా అవతరిస్తాడన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on May 21, 2022 6:59 am
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…