టీనేజీలోనూ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాలతో అతడికి వచ్చిన మాస్ ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. కానీ తర్వాత ఆ స్థాయి విజయాలు దక్కక అతను కొంచెం వెనుకబడ్డాడు. ఒక దశలో వరుస పరాజయాలతో అతడి కెరీర్ బాగా స్లో అయింది కూడా. కానీ టెంపర్ దగ్గర్నుంచి పుంజుకుని నిలకడగా విజయాలు అందుకుంటున్నాడు. మూడున్నరేళ్ల కిందట అరవింద సమేతతో కెరీర్లో మంచి హిట్ కొట్టి.. తాజాగా ఆర్ఆర్ఆర్తో రికార్డు హిట్లో భాగం అయ్యాడు.
ఐతే తారక్ వరుసగా విజయాలు సాధిస్తున్నా, సినిమా సినిమాకూ ఎదుగుతున్నా.. అభిమానుల్లో కొంత అసంతృప్తి లేకపోలేదు. అందుక్కారణం.. తారక్ స్టామినాకు తగ్గ మాస్ సినిమా పడకపోవడమే. ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఆ మాస్నే అతను మిస్ అయిపోతున్నాడన్నది వాళ్ల బాధ.
అరవింద సమేతలో కొంత వరకే మాస్ ఉంటుంది. మిగతా అంతా క్లాస్గా సాగిపోతుంది. ఆర్ఆర్ఆర్ అంటే అది వేరే వ్యవహారం. అందులో మాస్ కోణంలో చూస్తే తారక్కు రావాల్సినంత ఎలివేషన్ రాలేదన్న ఫీలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తారక్ పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేయాలని, తన స్టామినా మొత్తం తెరపై చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే ఇప్పుడు తారక్ సరిగ్గా అలాంటి సినిమాలే లైన్లో పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
తారక్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన రెండు సినిమాల గ్లింప్స్ చూస్తే మాస్కు ఇవి పూనకాలు తెప్పించేలాగే కనిపిస్తున్నాయి. తారక్తో తన సినిమా పూర్తి స్థాయి మాస్గా ఉంటుందని కొరటాల ముందే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు టీజర్ చూశాక అతను చెప్పినదానికంటే మాస్గా కనిపించింది. ఇక ప్రశాంత్ నీల్ సంగతి అసలు చెప్పాల్సిన పనే లేదు. ప్రి లుక్, దాని గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తే ఇది కూడా ఊర మాస్గా ఉంటుందనే అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో తారక్ మరోసారి తిరుగులేని మాస్ హీరోగా అవతరిస్తాడన్నది అభిమానుల ఆకాంక్ష.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…