టీనేజీలోనూ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించి.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాలతో అతడికి వచ్చిన మాస్ ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. కానీ తర్వాత ఆ స్థాయి విజయాలు దక్కక అతను కొంచెం వెనుకబడ్డాడు. ఒక దశలో వరుస పరాజయాలతో అతడి కెరీర్ బాగా స్లో అయింది కూడా. కానీ టెంపర్ దగ్గర్నుంచి పుంజుకుని నిలకడగా విజయాలు అందుకుంటున్నాడు. మూడున్నరేళ్ల కిందట అరవింద సమేతతో కెరీర్లో మంచి హిట్ కొట్టి.. తాజాగా ఆర్ఆర్ఆర్తో రికార్డు హిట్లో భాగం అయ్యాడు.
ఐతే తారక్ వరుసగా విజయాలు సాధిస్తున్నా, సినిమా సినిమాకూ ఎదుగుతున్నా.. అభిమానుల్లో కొంత అసంతృప్తి లేకపోలేదు. అందుక్కారణం.. తారక్ స్టామినాకు తగ్గ మాస్ సినిమా పడకపోవడమే. ఎన్టీఆర్ అంటేనే మాస్.. కానీ ఆ మాస్నే అతను మిస్ అయిపోతున్నాడన్నది వాళ్ల బాధ.
అరవింద సమేతలో కొంత వరకే మాస్ ఉంటుంది. మిగతా అంతా క్లాస్గా సాగిపోతుంది. ఆర్ఆర్ఆర్ అంటే అది వేరే వ్యవహారం. అందులో మాస్ కోణంలో చూస్తే తారక్కు రావాల్సినంత ఎలివేషన్ రాలేదన్న ఫీలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తారక్ పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేయాలని, తన స్టామినా మొత్తం తెరపై చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే ఇప్పుడు తారక్ సరిగ్గా అలాంటి సినిమాలే లైన్లో పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
తారక్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన రెండు సినిమాల గ్లింప్స్ చూస్తే మాస్కు ఇవి పూనకాలు తెప్పించేలాగే కనిపిస్తున్నాయి. తారక్తో తన సినిమా పూర్తి స్థాయి మాస్గా ఉంటుందని కొరటాల ముందే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు టీజర్ చూశాక అతను చెప్పినదానికంటే మాస్గా కనిపించింది. ఇక ప్రశాంత్ నీల్ సంగతి అసలు చెప్పాల్సిన పనే లేదు. ప్రి లుక్, దాని గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తే ఇది కూడా ఊర మాస్గా ఉంటుందనే అనిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో తారక్ మరోసారి తిరుగులేని మాస్ హీరోగా అవతరిస్తాడన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on May 21, 2022 6:59 am
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…