నిన్న ఓటిటి ఫ్యాన్స్ క్రేజీ కంటెంట్ తో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందానానలతో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉండగా ఇవి ఆల్రెడీ చూశాంగా ఇంకేమైనా కొత్తవి కావాలనుకునే వారికి బోలెడు ఆప్షన్స్ కళ్ళముందు నిలిచాయి. అందులో మొదటిది 12త్ మ్యాన్. మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ ఉంటుందేమోనని ఎదురు చూసిన వాళ్లకు నిరాశ కలిగిస్తూ కేవలం మలయాళం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు.
దృశ్యం సృష్టికర్త, దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక టాక్ సంగతి చూస్తే హైప్ తగ్గట్టు మూవీ తమను ఎగ్జైట్ చేయలేకపోయిందని అధిక శాతం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. జీతూ మార్క్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ లెన్త్ మరీ రెండు గంటల నలభై నిముషాలు ఉండటం, ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ ఎస్టాబ్లిష్ మెంట్ కే ఎక్కువ సమయం తీసుకోవడం బోర్ గా ఫీలయ్యామని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ తీవ్ర అసంతృప్తి కాదు కానీ ఫైనల్ గా హ్యాపీ కాలేదని అంటున్నారు.
కథ విషయానికి వస్తే స్నేహితులంతా కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు. సరదాగా ఒక గేమ్ ఆడటం మొదలుపెడతారు. అనూహ్యంగా అందులో అమ్మాయి హత్యకు గురవుతుంది. దాంతో హంతకుడెవరో తెలుసుకునే క్రమంలో మోహన్ లాల్ వాళ్ళ మధ్యలోకి వస్తాడు. అసలింతకీ 12త్ మ్యాన్ అంటే ఎవరు, మర్డర్ ఎందుకు చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా. మోహన్ లాల్ మీద అభిమానముంటే చూసేయొచ్చు కానీ దృశ్యం కాంబో కదాని అంచనాలు ఎక్కువ పెట్టుకుంటేనే చిక్కు.
This post was last modified on May 21, 2022 6:55 am
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…