టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. పదేళ్లు కూడా వయసు లేనపుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వందల చిత్రాల్లో నటించాడతను. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అతడిది. ఇందులో 90వ దశకం నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు ఆలీ హవా బాగా నడిచింది. బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ లాంటి వాళ్ల హవాలోనూ తన సినిమాలు తనకుండేవి. కానీ గత దశాబ్ద కాలంలో ఆలీ జోరు బాగా తగ్గింది.
బ్రహ్మానందం అంతటివాడే ట్రెండుకు తగ్గట్లు కామెడీ చేయలేక, క్యారెక్టర్లు పండక సైడైపోయాడు. ఇక ఆలీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆలీ రాజకీయాల్లో అడుగు పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో చాలామందికి చెడుగా మారి.. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల మాట. కారణాలేవైనా సరే.. ఆలీ కెరీర్ అయితే ఆశాజనకంగా లేదు.
ఐతే వచ్చే వారం విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘ఎఫ్-3’లో ఆలీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో అతడి పాత్ర పేరు పాల బేబీ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆలీ.. కెరీర్ ఊపు తగ్గడంపై మాట్లాడాడు. “ఏ క్యారెక్టర్ పడితే అది చేయొద్దనే సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. వాళ్లు కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నపుడు ఆలీ ఎందుకు ఇలాంటి సినిమాలో నటించాడు అని జనాలు అనుకుంటున్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వదులుకున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నియమం పెట్టుకున్నాను. ఎఫ్-3లో మంచి పాత్ర దక్కింది. సినిమాలో నా పాత్ర 45 నిమిషాలు ఉంటుంది. వడ్డీకి డబ్బులు తిప్పే పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడన్నది తెరపైనే చూడాలి” అని ఆలీ చెప్పాడు.
ఇక వైకాపా తరఫున కష్టపడి ప్రచారం చేసినా ఏ పదవీ దక్కకపోవడంపై ఆలీ మాట్లాడుతూ.. “నన్ను రాజకీయ నాయకుడిని చేసింది జగన్ గారు. ఆయన నాకు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్ వస్తే వెళ్తా” అని చెప్పాడు.
This post was last modified on May 19, 2022 2:56 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…