టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. పదేళ్లు కూడా వయసు లేనపుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వందల చిత్రాల్లో నటించాడతను. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అతడిది. ఇందులో 90వ దశకం నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు ఆలీ హవా బాగా నడిచింది. బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ లాంటి వాళ్ల హవాలోనూ తన సినిమాలు తనకుండేవి. కానీ గత దశాబ్ద కాలంలో ఆలీ జోరు బాగా తగ్గింది.
బ్రహ్మానందం అంతటివాడే ట్రెండుకు తగ్గట్లు కామెడీ చేయలేక, క్యారెక్టర్లు పండక సైడైపోయాడు. ఇక ఆలీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆలీ రాజకీయాల్లో అడుగు పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో చాలామందికి చెడుగా మారి.. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల మాట. కారణాలేవైనా సరే.. ఆలీ కెరీర్ అయితే ఆశాజనకంగా లేదు.
ఐతే వచ్చే వారం విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘ఎఫ్-3’లో ఆలీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో అతడి పాత్ర పేరు పాల బేబీ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆలీ.. కెరీర్ ఊపు తగ్గడంపై మాట్లాడాడు. “ఏ క్యారెక్టర్ పడితే అది చేయొద్దనే సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. వాళ్లు కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నపుడు ఆలీ ఎందుకు ఇలాంటి సినిమాలో నటించాడు అని జనాలు అనుకుంటున్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వదులుకున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నియమం పెట్టుకున్నాను. ఎఫ్-3లో మంచి పాత్ర దక్కింది. సినిమాలో నా పాత్ర 45 నిమిషాలు ఉంటుంది. వడ్డీకి డబ్బులు తిప్పే పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడన్నది తెరపైనే చూడాలి” అని ఆలీ చెప్పాడు.
ఇక వైకాపా తరఫున కష్టపడి ప్రచారం చేసినా ఏ పదవీ దక్కకపోవడంపై ఆలీ మాట్లాడుతూ.. “నన్ను రాజకీయ నాయకుడిని చేసింది జగన్ గారు. ఆయన నాకు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్ వస్తే వెళ్తా” అని చెప్పాడు.
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…