టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. పదేళ్లు కూడా వయసు లేనపుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వందల చిత్రాల్లో నటించాడతను. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అతడిది. ఇందులో 90వ దశకం నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు ఆలీ హవా బాగా నడిచింది. బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ లాంటి వాళ్ల హవాలోనూ తన సినిమాలు తనకుండేవి. కానీ గత దశాబ్ద కాలంలో ఆలీ జోరు బాగా తగ్గింది.
బ్రహ్మానందం అంతటివాడే ట్రెండుకు తగ్గట్లు కామెడీ చేయలేక, క్యారెక్టర్లు పండక సైడైపోయాడు. ఇక ఆలీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆలీ రాజకీయాల్లో అడుగు పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో చాలామందికి చెడుగా మారి.. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల మాట. కారణాలేవైనా సరే.. ఆలీ కెరీర్ అయితే ఆశాజనకంగా లేదు.
ఐతే వచ్చే వారం విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘ఎఫ్-3’లో ఆలీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో అతడి పాత్ర పేరు పాల బేబీ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆలీ.. కెరీర్ ఊపు తగ్గడంపై మాట్లాడాడు. “ఏ క్యారెక్టర్ పడితే అది చేయొద్దనే సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. వాళ్లు కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నపుడు ఆలీ ఎందుకు ఇలాంటి సినిమాలో నటించాడు అని జనాలు అనుకుంటున్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వదులుకున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నియమం పెట్టుకున్నాను. ఎఫ్-3లో మంచి పాత్ర దక్కింది. సినిమాలో నా పాత్ర 45 నిమిషాలు ఉంటుంది. వడ్డీకి డబ్బులు తిప్పే పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడన్నది తెరపైనే చూడాలి” అని ఆలీ చెప్పాడు.
ఇక వైకాపా తరఫున కష్టపడి ప్రచారం చేసినా ఏ పదవీ దక్కకపోవడంపై ఆలీ మాట్లాడుతూ.. “నన్ను రాజకీయ నాయకుడిని చేసింది జగన్ గారు. ఆయన నాకు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్ వస్తే వెళ్తా” అని చెప్పాడు.
This post was last modified on May 19, 2022 2:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…