టాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. పదేళ్లు కూడా వయసు లేనపుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వందల చిత్రాల్లో నటించాడతను. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అతడిది. ఇందులో 90వ దశకం నుంచి ఒక రెండు దశాబ్దాల పాటు ఆలీ హవా బాగా నడిచింది. బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ లాంటి వాళ్ల హవాలోనూ తన సినిమాలు తనకుండేవి. కానీ గత దశాబ్ద కాలంలో ఆలీ జోరు బాగా తగ్గింది.
బ్రహ్మానందం అంతటివాడే ట్రెండుకు తగ్గట్లు కామెడీ చేయలేక, క్యారెక్టర్లు పండక సైడైపోయాడు. ఇక ఆలీ సంగతి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆలీ రాజకీయాల్లో అడుగు పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఇండస్ట్రీలో చాలామందికి చెడుగా మారి.. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడిందన్నది విశ్లేషకుల మాట. కారణాలేవైనా సరే.. ఆలీ కెరీర్ అయితే ఆశాజనకంగా లేదు.
ఐతే వచ్చే వారం విడుదల కాబోతున్న క్రేజీ మూవీ ‘ఎఫ్-3’లో ఆలీ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇందులో అతడి పాత్ర పేరు పాల బేబీ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాను కలిసిన ఆలీ.. కెరీర్ ఊపు తగ్గడంపై మాట్లాడాడు. “ఏ క్యారెక్టర్ పడితే అది చేయొద్దనే సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో పాత్రలు ఇస్తున్నారు. వాళ్లు కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నపుడు ఆలీ ఎందుకు ఇలాంటి సినిమాలో నటించాడు అని జనాలు అనుకుంటున్నారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వదులుకున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నియమం పెట్టుకున్నాను. ఎఫ్-3లో మంచి పాత్ర దక్కింది. సినిమాలో నా పాత్ర 45 నిమిషాలు ఉంటుంది. వడ్డీకి డబ్బులు తిప్పే పాల బేబీ గన్ ఎందుకు పట్టుకున్నాడన్నది తెరపైనే చూడాలి” అని ఆలీ చెప్పాడు.
ఇక వైకాపా తరఫున కష్టపడి ప్రచారం చేసినా ఏ పదవీ దక్కకపోవడంపై ఆలీ మాట్లాడుతూ.. “నన్ను రాజకీయ నాయకుడిని చేసింది జగన్ గారు. ఆయన నాకు ముందు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్ వస్తే వెళ్తా” అని చెప్పాడు.
This post was last modified on May 19, 2022 2:56 pm
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…