రాజకీయాల నుంచి సినిమాల వైపు మనసు మళ్లడంతో పవన్ కళ్యాణ్ ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీక్ష పూనినట్టు వకీల్ సాబ్, క్రిష్ సినిమా చేస్తున్న టైంలో కరోనా విపత్తు వల్ల షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో పవన్ మూడ్ మళ్ళీ సినిమాల నుంచి డైవర్ట్ అయిందట.
వకీల్ సాబ్ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. దసరాకి సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నట్టయితే వాడుకోవాలనేది దిల్ రాజు ఐడియా. అయితే పవన్ షూటింగ్స్ చేసే మూడ్ లో లేకపోవడమే కాదు, సినిమా వాళ్లకు అందుబాటులోను లేరని వినిపిస్తోంది. కరోనా సమస్య ఇంకా అలాగే ఉంది కనుక అన్నీ నార్మల్ అయ్యేవరకు పవన్ షూటింగ్ చేసే ఆలోచనలో లేనట్టు భోగట్టా.
పవన్ మాత్రమే కాదు పలువురు అగ్ర హీరోలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. సినిమా, టీవీ రంగంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు తొంభై శాతం మంది రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు.
This post was last modified on June 24, 2020 3:58 pm
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…