ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ మూవీస్ తోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టిన కృష్ణవంశీ చాలా కాలం నుంచి తన స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోయారు. చేతికొచ్చిన బంగారంలాంటి అవకాశం గోవిందుడు అందరి వాడేలేతో వృధా చేసుకున్నారు. బిల్డప్ గట్టిగా కనిపించిన నక్షత్రం కొన్నవాళ్ళకు నక్షత్రాలను చూపించింది. వీటి ముందు కూడా మొగుడు, శశిరేఖా పరిణయం లాంటి ఫ్లాపులు చాలానే ఉన్నాయి. సరే ఇదంతా టైం బ్యాడ్, ఎప్పుడో ఒకప్పుడు ఫామ్ లోకి రాకపోరాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు
ఇప్పుడు నిర్మాణంలో ఉన్న రంగమార్తాండ మీద ఆయనకే కాదు ఫ్యాన్స్ కు సైతం చాలా ఆశలున్నాయి. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్ర పోషించగా రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అంతఃపురం తర్వాత ఇళయరాజా సంగీతం అందిస్తున్న కృష్ణవంశి మూవీ ఇదే. సో మ్యూజికల్ గానూ దీని మీద స్పెషల్ కార్నర్ ఉంది. అయితే రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ బడ్జెట్ సినిమా విడుదల అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఖచ్చితంగా చెప్పడం లేదు.
మరాఠిలో నానా పాటేకర్ నటసామ్రాట్ రీమేక్ గా రూపొందిన రంగమార్తాండకు కొన్ని ఓటిటి సంస్థలు 20 కోట్ల దాకా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఎలా చూసుకున్నా క్యాస్టింగ్ కి, ప్రొడక్షన్ కు పెట్టిన ఖర్చుకి అంత మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. అసలు బజ్ లేని ఈ సినిమాకు హైప్ తేవడం కోసమే లీకులు ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. పోనీ థియేటర్లలో వదులుతారా అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఎంత కళాత్మకంగా తీసినా ఇలాంటి వాటిని హాలు దాకా వచ్చి ప్రేక్షకులు చూడటం అనుమానమే. పైగా సెప్టెంబర్ దాకా శుక్రవారాలు బ్లాక్ అయ్యాయి. మరి రంగమార్తాండ ఏ రూటు తీసుకుంటాడో వేచి చూడాలి.
This post was last modified on May 15, 2022 7:50 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…