గతంలో దిల్ రాజు ప్రకటించినట్టుగా రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సినిమా 2023 సంక్రాంతికి రావడం లేదు. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం వేసవిలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ప్లాన్ కానీ ఆలోచన కానీ లేదట.
అనుకున్న టైంకన్నా వేగంగానే షూటింగ్ జరుగుతున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం శంకర్ తగినంత సమయం ఇవ్వమని కోరడంతో దిల్ రాజు చరణ్ ఇద్దరూ అదే కరెక్ట్ అని భావించి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. ఇందులో చరణ్ రెండు మూడు షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ చేశారని ఆల్రెడీ టాక్ ఉంది. ప్రస్తుతం తను కాలేజ్ స్టూడెంట్ గా వ్యవహరించే ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. అంతకు ముందు రాజమండ్రిలో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం జరుగుతున్న షూట్ లో కియారా అద్వానీ కూడా ఉంది. తాత్కాలికంగా తను బ్రేక్ తీసుకుంది. భూల్ భులాయ్యా 2 ప్రమోషన్ల కోసం ముంబై వెళ్ళింది. అది రిలీజయ్యాక తిరిగి చరణ్ తో జాయినవుతుంది.
ఇప్పటికే ఫోటోలు వీడియోల లీకుల రూపంలో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినా ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్యాన్ ఇండియా లెవెల్ లో మళ్ళీ దీంతోనే తమ హీరో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ.
This post was last modified on May 15, 2022 4:46 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…