Movie News

రేస్ నుంచి రామ్ చరణ్ తప్పుకున్నట్టే

గతంలో దిల్ రాజు ప్రకటించినట్టుగా రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సినిమా 2023 సంక్రాంతికి రావడం లేదు. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఇన్ సైడ్ లీక్స్ ప్రకారం వేసవిలో తప్ప అంతకన్నా ముందు వచ్చే ప్లాన్ కానీ ఆలోచన కానీ లేదట.

అనుకున్న టైంకన్నా వేగంగానే షూటింగ్ జరుగుతున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం శంకర్ తగినంత సమయం ఇవ్వమని కోరడంతో దిల్ రాజు చరణ్ ఇద్దరూ అదే కరెక్ట్ అని భావించి అంగీకారం తెలిపినట్టు సమాచారం.

ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. ఇందులో చరణ్ రెండు మూడు షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ చేశారని ఆల్రెడీ టాక్ ఉంది. ప్రస్తుతం తను కాలేజ్ స్టూడెంట్ గా వ్యవహరించే ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. అంతకు ముందు రాజమండ్రిలో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యాయి.

ప్రస్తుతం జరుగుతున్న షూట్ లో కియారా అద్వానీ కూడా ఉంది. తాత్కాలికంగా తను బ్రేక్ తీసుకుంది. భూల్ భులాయ్యా 2 ప్రమోషన్ల కోసం ముంబై వెళ్ళింది. అది రిలీజయ్యాక తిరిగి చరణ్ తో జాయినవుతుంది.

ఇప్పటికే ఫోటోలు వీడియోల లీకుల రూపంలో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినా ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్యాన్ ఇండియా లెవెల్ లో మళ్ళీ దీంతోనే తమ హీరో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ.

This post was last modified on May 15, 2022 4:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

1 hour ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

1 hour ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago