సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద బాగానే దూసుకుపోతోంది. విడుదలకు ముందు ఒక్కడు పోకిరి రేంజ్ అని ఊదరగొట్టినంత స్థాయిలో కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ కున్న ఫాలోయింగ్ వీకెండ్ కలెక్షన్లను పడిపోకుండా కాపాడుతోంది.
అయితే సోషల్ మీడియాలో మైత్రి సంస్థ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్లు ఇతర హీరోల నుంచి ఫ్యాన్ వార్ కు అవకాశమిచ్చాయి. హైదరాబాద్ లో మొదటి రోజు కొన్ని చోట్ల ఫుల్స్ పడకుండానే నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు పేరుతో ఫిగర్లు ఎలా ఇస్తారని నిలదీయడం మొదలుపెట్టారు.
సరే ఇదంతా సహజమే అనుకోవచ్చు కానీ నిన్న సాయంత్రం మైత్రి మేకర్స్ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నెగటివ్ రివ్యూస్ మీమ్స్ నుంచి బ్లాక్ బస్టర్ స్థాయికి సర్కారు వారి పాట చేరుకుందని ప్రత్యేకంగా ట్వీట్ వేయడం మరింత చర్చకు దారినిచ్చింది.
నిజానికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కామెంట్ చేశారని లేదా ఏదో న్యూస్ ఛానల్ లో సినిమా గురించి ఫ్లాప్ ప్రచారం చేశారని రియాక్ట్ అయితే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఆమాటకొస్తే ఆర్ఆర్ఆర్ బాలేదని తక్కువ రేటింగ్స్ ఇచ్చిన సైట్స్ ఉన్నాయిగా.
నిజంగా సినిమా బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు ముందు మాకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆ మాటకొస్తే టాక్ బావుంటే జనం సోషల్ మీడియాని పట్టించుకోరు. చూడాలని డిసైడ్ అయితే థియేటర్ కు వెళ్ళిపోతారు.
ఫస్ట్ వీక్ కోసం డిసైడ్ చేసిన విపరీతమైన టికెట్ రేట్లు సర్కారు వారి పాట ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిన మాట వాస్తవం. అది విశ్లేషించుకుని ఏం చేస్తే బాగుంటుందాని ఆలోచించాలి కానీ ఇలా రివర్స్ లో నెగటివ్ ప్రచారం చేసిన వాళ్ళను టార్గెట్ చేస్తే అది బూమరాంగ్ అవుతుంది. అందుకే ఈ ట్వీట్ చూడగానే యాంటీ ఫ్యాన్స్ అదేదో తమ ఘనకార్యం అన్నట్టుగా చెప్పుకోవడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on May 15, 2022 4:47 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…