ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంత ముఖ్యమో దాని సపోర్ట్ కూడా అంతే కీలకం. అఫ్కోర్స్ సక్సెస్ కూడా వెంట ఉంటేనే ఇక్కడ అవకాశాలు, సినిమాల రిలీజులు క్యూ కడతాయి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు.
మెగాస్టార్ చిన్నల్లుడిగా తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడినట్టే కనిపిస్తోంది. ఆ మధ్య సూపర్ మచ్చి అనే కళాఖండం వచ్చింది. మొదటిరోజే డెఫిషిట్లతో వారం దాటకుండానే థియేటర్ల నుంచి మాయమయ్యింది. మొన్నెప్పుడో ప్రైమ్ లో వస్తే కానీ ప్రేక్షకులు గుర్తించలేకపోయారు.
డెబ్యూ మూవీ విజేత కాస్త నయం. హాళ్లలో ఆడకపోయినా అంతో ఇంతో టీవీలో వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడితని మూడో సినిమా కిన్నెరసాని విడుదలకు సిద్ధంగా ఉన్నా ల్యాబ్ నుంచి బయటికి రావడం లేదు. ట్రైలర్ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేశారు.
రెండు మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. అంతే దాని తరువాత అంతా గప్ చుప్. రామ్ తాళ్ళూరి లాంటి బలమైన నేపథ్యం ఉన్న నిర్మాత తీసినప్పటికి ఇది అసలు ఎప్పుడు వస్తుందో ఎవరికీ అర్థం కానీ విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
కళ్యాణ్ దేవ్ కు మెగా ఫ్యామిలీతో గ్యాప్ వచ్చేసిందని, శ్రీజతో కూడా కలిసి ఉండట్లేదని రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా తర్వాత పరిణామాలు జరిగాయి. కళ్యాణ్ దేవ్ మీడియా ముందుకు రావడం మానేశాడు.
నాగశౌర్యతో అశ్వద్ధామ తీసిన రమణతేజ ఈ కిన్నెరసానికి దర్శకుడు. అతనూ సైలెంట్ గానే ఉన్నాడు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని ఒకవేళ ఓటిటిలో ఇచ్చే ఆలోచన ఉంటే అదైనా త్వరగా చేస్తే బెటర్. ఆలస్యం జరిగే కొద్ది ఆల్రెడీ జీరోలో ఉన్న బజ్ మైనస్ కు చేరుకుంటుంది
This post was last modified on May 9, 2022 12:45 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…