యువ కథానాయకుడు విశ్వక్సేన్ కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ చిత్రానికి హైదరాబాద్లో స్పెషల్ ప్రిమియర్స్ వేయగా.. దాన్నుంచి మంచి టాకే వచ్చింది. ఐతే సెలబ్రెటీలకు వేసే ఇలాంటి షోల నుంచి వచ్చే టాక్ను నమ్మడానికి వీల్లేదని గతంలో కొన్ని సినిమాలు రుజువు చేసిన నేపథ్యంలో ప్రేక్షకులు సామాన్య ప్రేక్షకుల టాక్ కోసం ఎదురు చూశారు.
యుఎస్ ప్రిమియర్స్ నుంచే మంచి రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు మంచి టాకే వచ్చింది. విశ్వక్సేన్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా నెమ్మదస్తుడు, బిడియస్తుడు, మొహమాటస్తుడిగా కనిపించిన అర్జున్ పాత్ర అందరికీ కొత్తగా అనిపిస్తూ బాగా నచ్చుతోంది. సినిమాకు అతడి క్యారెక్టరే మేజర్ హైలైట్ అని అందరూ అంటున్నారు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ విషయానికి ఆమె పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు.
నిజానికి ప్రోమోల్లో అంతా ఆమే హైలైట్ అయింది కానీ.. సినిమా విషయానికి వచ్చేసరికి ఆమె పాత్ర ఒక దశ దాటాక పక్కకు వెళ్లిపోయింది. సినిమా చివరికి వచ్చేసరికి రుక్సర్ లీడ్ హీరోయిన్లానే అనిపించలేదు. హీరోయిన్ చెల్లెలిలా మొదట్లో మామూలుగా కనిపించే రితిక నాయక్ అనే కొత్తమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. పోను పోనూ ఈ పాత్రే హైలైట్ అవుతూ చివరికి వచ్చేసరికి అది బలమైన ముద్రే వేస్తుంది.
అందానికి అందం, చక్కటి అభినయంతో ఆకట్టుకున్న రితిక బేసిగ్గా వ్లాగర్ కమ్ మోడల్. తెలుగులో ఆమెకిదే తొలి చిత్రం. సినిమాలో ఆమెది కీలక పాత్ర అయినా.. తనే హైలైట్ అయినా ప్రోమోల్లో ఎందుకో ఆమెను హైలైట్ చేయలేదు. రుక్సరే కథానాయికలా కనిపించింది. కానీ సినిమా చూసిన వాళ్లకు ఈమె పాత్ర పెద్ద సర్ప్రైజ్ లాగా కనిపించింది. కుర్రాళ్లంతా తనతో ప్రేమలో పడిపోవడం ఖాయం. ఈ సినిమా తర్వాత రితికకు మంచి అవకాశాలు రావచ్చు.
This post was last modified on May 6, 2022 4:58 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…