ప్రస్తుతం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ పెర్ఫామర్ల జాబితాలో అగ్ర భాగాన నిలిచే అమ్మాయి సాయిపల్లవి. ఒక పెర్ఫామెన్స్ కోసం లక్షల మంది థియేటర్లకు రావడం అన్నది సాయిపల్లవి లాంటి అది కొద్దిమంది హీరోయిన్ల విషయంలోనే జరుగుతుంది.
నయనతార, అనుష్క కూడా ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లే కానీ.. వాళ్లకు నటనతో పాటు అందచందాలు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ పాయింట్లే. ఐతే సాయిపల్లవి గ్లామర్ విషయంలో వాళ్లతో పోలిస్తే వెనుకే ఉంటుంది. కేవలం ఆమె పెర్ఫామెన్స్ చూడాలనే ఆశతోనే ప్రేక్షకులు తన సినిమాలకు వెళ్తారు.
ఈ విషయంలో హీరోలతో సమానమైన ఆకర్షణ ఆమెది. కొన్నిసార్లు హీరోలను సైతం ఆమె డామినేట్ చేస్తుంటుంది. తనే హైలైట్ అవుతుంటుంది. అందుకే ఆమెతో చేయడానికి హీరోలు సైతం కంగారు పడిపోతుంటారు. అలాంటిది సాయిపల్లవి ఉన్న సినిమాలో మరో హీరోయిన్ ఉంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటిదాకా సాయిపల్లవి నటించిన సినిమాల్లో చాలా వరకు ఆమె సోలో హీరోయిన్గా ఉన్నవే. తొలి సినిమా ‘ప్రేమమ్’లో నటించేటప్పటికి ఆమె సత్తా ఏంటో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ సాయిపల్లవినే హైలైట్ అయింది. ఆ తర్వాతి నుంచి ఆమెను సోలో హీరోయిన్గానే చూస్తున్నాం.
ఐతే నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’లో ముగ్గురు హీరోయిన్లుంటారని, అందులో ఒకరు సాయిపల్లవి అని వార్త బయటికి వచ్చింది. మిగతా ఇద్దరు హీరోయిన్లెవరన్నది తెలియదు. ఐతే సాయిపల్లవి ఉన్న సినిమాలో మిగతా రెండు హీరోయిన్ పాత్రలకు ఎవరు ముందుకొస్తారన్నది సందేహం. సాయిపల్లవి ఉందంటే ఆమె మనల్ని తినేస్తుంది.. తనుండగా మనం ఏం హైలైట్ అవుతాం అన్న భయం హీరోయిన్లలో ఉండకపోదు.
ఐతే నాని, రాహుల్ సంకృత్యన్ లాంటి కాంబినేషన్ చూశాక ఈ సినిమా చేస్తే బాగుంటుందన్న ఆశా పుడుతుంది. ఐతే పేరున్న హీరోయిన్లయితే ఇందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశమైతే లేదు. మరి ఆ రెండు పాత్రల్లో ఎవరు ఫిక్సవుతారో చూడాలి.
This post was last modified on June 26, 2020 10:01 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…