Movie News

అమ్మో సాయిపల్లవి పక్కనా.. తినేయదూ

ప్రస్తుతం సౌత్ ఇండియన్ హీరోయిన్లలో బెస్ట్ పెర్ఫామర్ల జాబితాలో అగ్ర భాగాన నిలిచే అమ్మాయి సాయిపల్లవి. ఒక పెర్ఫామెన్స్ కోసం లక్షల మంది థియేటర్లకు రావడం అన్నది సాయిపల్లవి లాంటి అది కొద్దిమంది హీరోయిన్ల విషయంలోనే జరుగుతుంది.

నయనతార, అనుష్క కూడా ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లే కానీ.. వాళ్లకు నటనతో పాటు అందచందాలు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్లస్ పాయింట్లే. ఐతే సాయిపల్లవి గ్లామర్ విషయంలో వాళ్లతో పోలిస్తే వెనుకే ఉంటుంది. కేవలం ఆమె పెర్ఫామెన్స్ చూడాలనే ఆశతోనే ప్రేక్షకులు తన సినిమాలకు వెళ్తారు.

ఈ విషయంలో హీరోలతో సమానమైన ఆకర్షణ ఆమెది. కొన్నిసార్లు హీరోలను సైతం ఆమె డామినేట్ చేస్తుంటుంది. తనే హైలైట్ అవుతుంటుంది. అందుకే ఆమెతో చేయడానికి హీరోలు సైతం కంగారు పడిపోతుంటారు. అలాంటిది సాయిపల్లవి ఉన్న సినిమాలో మరో హీరోయిన్ ఉంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా సాయిపల్లవి నటించిన సినిమాల్లో చాలా వరకు ఆమె సోలో హీరోయిన్‌గా ఉన్నవే. తొలి సినిమా ‘ప్రేమమ్’లో నటించేటప్పటికి ఆమె సత్తా ఏంటో ఎవరికీ తెలియదు. ఆ చిత్రంలో ఇంకో ఇద్దరు హీరోయిన్లున్నప్పటికీ సాయిపల్లవినే హైలైట్ అయింది. ఆ తర్వాతి నుంచి ఆమెను సోలో హీరోయిన్‌గానే చూస్తున్నాం.

ఐతే నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’లో ముగ్గురు హీరోయిన్లుంటారని, అందులో ఒకరు సాయిపల్లవి అని వార్త బయటికి వచ్చింది. మిగతా ఇద్దరు హీరోయిన్లెవరన్నది తెలియదు. ఐతే సాయిపల్లవి ఉన్న సినిమాలో మిగతా రెండు హీరోయిన్ పాత్రలకు ఎవరు ముందుకొస్తారన్నది సందేహం. సాయిపల్లవి ఉందంటే ఆమె మనల్ని తినేస్తుంది.. తనుండగా మనం ఏం హైలైట్ అవుతాం అన్న భయం హీరోయిన్లలో ఉండకపోదు.

ఐతే నాని, రాహుల్ సంకృత్యన్ లాంటి కాంబినేషన్ చూశాక ఈ సినిమా చేస్తే బాగుంటుందన్న ఆశా పుడుతుంది. ఐతే పేరున్న హీరోయిన్లయితే ఇందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశమైతే లేదు. మరి ఆ రెండు పాత్రల్లో ఎవరు ఫిక్సవుతారో చూడాలి.

This post was last modified on June 26, 2020 10:01 am

Share

Recent Posts

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

4 minutes ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

1 hour ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

2 hours ago

భారత్‌పై 100 శాతం టారిఫ్.. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…

2 hours ago

సుబ్బులక్ష్మిని తలచుకుని నిర్మలమ్మ కంటతడి

ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు.…

2 hours ago

500 కోట్ల.. శ్రీదేవి ఆస్తి వివాదం.. చివ‌ర‌కు ఏమైదంటే!

ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…

5 hours ago