Movie News

సర్కారు సుదర్శన్ లోనే – సాధించిన ఫ్యాన్స్

ఎన్ని మల్టీప్లెక్సులు ఉన్నా హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉండే సింగల్ స్క్రీన్ల క్రేజే వేరు. అందుకే బెనిఫిట్ షోలను అక్కడ చూస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. ముఖ్యంగా దేవి కాంప్లెక్స్ లో జరిగే అల్లరి తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లైనా.

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు సుదర్శన్ 35 ఎంఎం మీదున్న సెంటిమెంట్ ఎమోషన్ దేని మీద లేదు రాదు. సూపర్ స్టార్ శతదినోత్సవాలు సిల్వర్ జూబ్లీలు అందులోనే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కాని నిన్నటిదాకా సర్కారు వారి పాట ఈ విషయంలో టెన్షన్ పడింది.

ఎందుకంటే RRR మే 12కి నలభై ఎనిమిదో రోజులో ఉంటుంది. సుదర్శన్ 35 ఎంఎం మెయిన్ థియేటర్ కావడంతో అందులోనే ఫిఫ్టీ డేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి పూర్తిగా తీసేయడం కుదరదు. పైగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోల అభిమానులతో ముడిపడిన వ్యవహారం.

దీంతో సర్కారు వారి పాటకు వేరే స్క్రీన్లు కేటాయించి మే 27న విడుదలయ్యే ఎఫ్3కి సుదర్శన్ 35 ఎంఎం ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.

ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు మే 12న సర్కారు వారి పాట సుదర్శన్ లోనూ ఉంటుంది. కాకపోతే రెండు లేదా మూడు షోలు మాత్రమే ఉంటాయి. మిగిలినవి ఆర్ఆర్ఆర్ వేస్తారు. అర్ధశతదినోత్సవం కాగానే సర్కారు రెగ్యులర్ షోస్ తో అందులోనే కంటిన్యూ అవుతుంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని తెలిసింది. సో ఒక్కడు, పోకిరి, మురారి, దూకుడు, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆడిన సుదర్శన్ 35 ఎంఎంలోనే సర్కారు కూడా అడుగుపెట్టబోతున్నాడు. సో సెంటిమెంట్ మిస్ కావడం లేదు.

Satya

Recent Posts

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

37 minutes ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

1 hour ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

2 hours ago

మళ్ళీ మౌనవ్రతం చేస్తున్న స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…

4 hours ago