Movie News

సర్కారు సుదర్శన్ లోనే – సాధించిన ఫ్యాన్స్

ఎన్ని మల్టీప్లెక్సులు ఉన్నా హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉండే సింగల్ స్క్రీన్ల క్రేజే వేరు. అందుకే బెనిఫిట్ షోలను అక్కడ చూస్తేనే అభిమానులకు కిక్ వస్తుంది. ముఖ్యంగా దేవి కాంప్లెక్స్ లో జరిగే అల్లరి తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లైనా.

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కు సుదర్శన్ 35 ఎంఎం మీదున్న సెంటిమెంట్ ఎమోషన్ దేని మీద లేదు రాదు. సూపర్ స్టార్ శతదినోత్సవాలు సిల్వర్ జూబ్లీలు అందులోనే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కాని నిన్నటిదాకా సర్కారు వారి పాట ఈ విషయంలో టెన్షన్ పడింది.

ఎందుకంటే RRR మే 12కి నలభై ఎనిమిదో రోజులో ఉంటుంది. సుదర్శన్ 35 ఎంఎం మెయిన్ థియేటర్ కావడంతో అందులోనే ఫిఫ్టీ డేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి పూర్తిగా తీసేయడం కుదరదు. పైగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోల అభిమానులతో ముడిపడిన వ్యవహారం.

దీంతో సర్కారు వారి పాటకు వేరే స్క్రీన్లు కేటాయించి మే 27న విడుదలయ్యే ఎఫ్3కి సుదర్శన్ 35 ఎంఎం ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.

ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు మే 12న సర్కారు వారి పాట సుదర్శన్ లోనూ ఉంటుంది. కాకపోతే రెండు లేదా మూడు షోలు మాత్రమే ఉంటాయి. మిగిలినవి ఆర్ఆర్ఆర్ వేస్తారు. అర్ధశతదినోత్సవం కాగానే సర్కారు రెగ్యులర్ షోస్ తో అందులోనే కంటిన్యూ అవుతుంది. ఈ మేరకు ఒప్పందం జరిగిందని తెలిసింది. సో ఒక్కడు, పోకిరి, మురారి, దూకుడు, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆడిన సుదర్శన్ 35 ఎంఎంలోనే సర్కారు కూడా అడుగుపెట్టబోతున్నాడు. సో సెంటిమెంట్ మిస్ కావడం లేదు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

27 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

1 hour ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

1 hour ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago