‘కేజీఎఫ్-2’ సినిమా చూసి మెజారిటీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లే కనిపించింది సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే. సమీక్షకులంతా కూడా యావరేజ్ రేటింగ్సే ఇచ్చారు ఈ చిత్రానికి. ‘చాప్టర్-1’తో పోలిస్తే కథాకథనాలు సహా చాలా విషయాల్లో ‘చాప్టర్-2’ తక్కువగానే కనిపించింది. ఐతేనేం.. కానీ ఇవేవీ ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్ సంచలనాలకు అడ్డం కాలేకపోయాయి.
తొలి రోజు నుంచి ఈ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. అందరి అంచనాలను మించిపోయి.. వరుసగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ‘కేజీఎఫ్-2’ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్లో మెగా బ్లాక్బస్టర్ల రికార్డులేవీ దీని ముందు నిలవలేకపోయాయి. అనేక భారీ చిత్రాల వసూళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు వెళ్లిపోయిన ‘కేజీఎఫ్-2’ ఇప్పుడు ఇంకో గొప్ప మైలురాయిని దాటేసింది.
ఆమిర్ ఖాన్ ఆల్ టైం బ్లాక్బస్టర్ ‘దంగల్’ వసూళ్ల రికార్డును ‘కేజీఎఫ్-2’ అధిగమించడం విశేషం. హిందీ మార్కెట్లో హైయెస్ట్ గ్రాసర్ల జాబితాలో మన రాజమౌళి సినిమా ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూ.511.3 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. మొన్నటిదాకా ‘దంగల్’ రూ.387.4 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఐతే ఇప్పుడు ఆమిర్ సినిమాను మూడో స్థానానికి నెడుతూ యశ్ మూవీ రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం థియేట్రికల్ రన్ అయ్యేసరికి ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.391.65 కోట్లకు చేరుకున్నాయి. ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును అందుకోవడం కూడా లాంఛనమే. సమీప భవిష్యత్తులో ఏ హిందీ చిత్రం కూడా దీని దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఓవరాల్గా ‘కేజీఎఫ్-2’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటేయడం తెలిసిందే. బాహుబలి-2, దంగల్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.1100 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనమే.
This post was last modified on May 5, 2022 1:25 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…