Movie News

నక్సలిజం బ్యాక్ డ్రాపే అసలు టెన్షన్

ఏదైనా సినిమా తీస్తున్నప్పుడు అందులో కథా వస్తువు వర్తమాన ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పీరియాడిక్ సబ్జెక్టు తీసుకున్నప్పుడు బలమైన కంటెంట్ తో మెప్పించగలగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద అడ్రెస్ గల్లంతవుతుంది. ఆచార్య కంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు. ముఖ్యంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని అవసరానికి మించి జొప్పించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు కొరటాల శివ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ ని చేతులారా వృథా చేసుకున్నారు.

దీని ఫలితానికి రానా సినిమాకి కనెక్షన్ ఏమనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. విరాట పర్వం పూర్తిగా నక్సలైట్ల పోరాటం మీద రూపొందిన యాక్షన్ డ్రామా. దర్శకుడు వేణు ఊడుగుల అభ్యుదయాన్ని విప్లవాన్ని జొప్పించి అసువులు బాసిన వీరులకు ఒక నివాళిగా దీన్ని తీసే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే నెలలు గడుస్తున్నా అటు నిర్మాత సురేష్ బాబు నుంచి కానీ ఇటు హీరో రానా నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. హీరోయిన్ సాయిపల్లవి సైతం ఈ సినిమా ప్రస్తావన ఎక్కడా తీసుకురావడం లేదు.

నిజానికి ఈ నక్సలిజం కాన్సెప్ట్ కొంత కాలంగా టాలీవుడ్ కు అంతగా అచ్చిరావడం లేదు. ఆ మధ్య కార్తికేయ హీరోగా వచ్చిన రాజా విక్రమార్కలోనూ ఇదే మైనస్ అయ్యింది. ఇప్పుడే కాదు కృష్ణవంశీ సిందూరంతో మొదలుపెట్టి చూస్తే ఈ జానర్ కు ఆదరణ అంతగా లేదు. ఆర్ నారాయణమూర్తి, దాసరిలు మాత్రమే విజయాలు సాధించారు. ఇదంతా సరే కానీ అసలు విరాటపర్వం షూటింగ్ పూర్తి చేసుకున్నా థియేటర్ రిలీజ్ చేయడం కానీ ఓటిటికి ఇవ్వడం కానీ ఎందుకు చేయడం లేదో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

This post was last modified on May 4, 2022 1:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago