నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. తెలుగు వారి పండుగలు ఏవి వచ్చినా అందుకు తగ్గ వస్త్రధారణతో, ఆహార్యంతో కనిపించే ఆయన.. పూజలు పునస్కారాల విషయంలో ఎంత పద్ధతిగా వ్యవహరిస్తారో అందరూ చూస్తూనే ఉంటారు.
అదే సమయంలో వేరే మతాలకు సంబంధించిన పండుగలు ఏవి వచ్చినా కూడా ఆయన వాటికి అంతే ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ.. అందుకు తగ్గ ఆహార్యంతో శుభాకాంక్షలు చెబుతారు. ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగానూ బాలయ్య తన మార్కు చూపించారు. తన నివాసంలో ఎన్టీఆర్ ఫొటో ముందు నిలబడి.. ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని రంజాన్ ప్రత్యేకతను చాటి చెబుతూ.. ఆయన తనదైన శైలిలో రంజాబ్ విషెస్ చెప్పారు ముస్లిం సోదరులకు.
‘‘ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.
ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వ మానవ సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ’’ అని నందమూరి హీరో పేర్కొన్నారు.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…