నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. తెలుగు వారి పండుగలు ఏవి వచ్చినా అందుకు తగ్గ వస్త్రధారణతో, ఆహార్యంతో కనిపించే ఆయన.. పూజలు పునస్కారాల విషయంలో ఎంత పద్ధతిగా వ్యవహరిస్తారో అందరూ చూస్తూనే ఉంటారు.
అదే సమయంలో వేరే మతాలకు సంబంధించిన పండుగలు ఏవి వచ్చినా కూడా ఆయన వాటికి అంతే ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ.. అందుకు తగ్గ ఆహార్యంతో శుభాకాంక్షలు చెబుతారు. ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగానూ బాలయ్య తన మార్కు చూపించారు. తన నివాసంలో ఎన్టీఆర్ ఫొటో ముందు నిలబడి.. ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని రంజాన్ ప్రత్యేకతను చాటి చెబుతూ.. ఆయన తనదైన శైలిలో రంజాబ్ విషెస్ చెప్పారు ముస్లిం సోదరులకు.
‘‘ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.
ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వ మానవ సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ’’ అని నందమూరి హీరో పేర్కొన్నారు.
This post was last modified on May 4, 2022 6:27 am
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…