Movie News

బాలయ్య మార్కు రంజాన్ విషెస్

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. మన సంస్కృతీ సంప్రదాయాలకు ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదో అందరికీ తెలుసు. తెలుగు వారి పండుగలు ఏవి వచ్చినా అందుకు తగ్గ వస్త్రధారణతో, ఆహార్యంతో కనిపించే ఆయన.. పూజలు పునస్కారాల విషయంలో ఎంత పద్ధతిగా వ్యవహరిస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. 

అదే సమయంలో వేరే మతాలకు సంబంధించిన పండుగలు ఏవి వచ్చినా కూడా ఆయన వాటికి అంతే ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ.. అందుకు తగ్గ ఆహార్యంతో శుభాకాంక్షలు చెబుతారు. ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగానూ బాలయ్య తన మార్కు చూపించారు. తన నివాసంలో ఎన్టీఆర్ ఫొటో ముందు నిలబడి.. ముస్లింలు ధరించే టోపీ పెట్టుకుని రంజాన్ ప్రత్యేకతను చాటి చెబుతూ.. ఆయన తనదైన శైలిలో రంజాబ్ విషెస్ చెప్పారు ముస్లిం సోదరులకు.

‘‘ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం.

ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వ మానవ సమానత్వం, సేవాభావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ’’ అని నందమూరి హీరో పేర్కొన్నారు. 

This post was last modified on May 4, 2022 6:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

2 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

7 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

8 hours ago

రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే…

9 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

9 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

9 hours ago