Movie News

భాయ్ లేని పండగ – బాక్సాఫీస్ విలవిల

ప్రతి సంవత్సరం రంజాన్ పండగంటే ఖచ్చితంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అంతగా భాయ్ మూవీకి అలవాటు పడ్డారు బాలీవుడ్ లవర్స్. ఇంకే ఇతర హీరో వచ్చినా అతని స్థాయిలో కలెక్షన్లు రావనేది చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. ఆఖరికి డిజాస్టర్లు కూడా వంద కోట్ల గ్రాస్ దాటిన దాఖలాలు ఉన్నాయి.

అందుకే సల్మాన్ ఈద్ ని మిస్ కాకుండా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడుకుని రిలీజులను ప్లాన్ చేసుకుంటాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల గత రెండేళ్లుగా అది సాధ్యపడటం లేదు. 2018లో వచ్చిన రేస్ 3 దారుణమైన కంటెంట్ తోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మరుసటి ఏడాది విడుదలైన భారత్ యావరేజ్ గా ఉన్నా ప్రేక్షకులు భారీ కలెక్షన్లు ఇచ్చారు.

ఇక రాధే డైరెక్ట్ ఓటిటి కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. ఈ గ్యాప్ ని ఇతర స్టార్లు వాడుకోలేకపోయారు. దీంతో ఇప్పుడీ 2022 రంజాన్ నార్త్ బాక్సాఫీస్ కు చప్పగా మిగిలిపోయింది. రెండు రోజుల క్రితం రిలీజైన హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించగా రన్ 34 పర్వాలేదనిపించుకున్నా ఫిగర్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ సెలవు రోజే అయినా ఉత్తరాది థియేటర్ల ఆక్యుపెన్సీ 25 శాతం లోపే ఉందట. ఉపవాసదీక్ష కారణంగా సినిమా హాళ్లకు దూరంగా ఉన్న ముస్లింలు కొత్త చిత్రాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ సల్మాన్ సినిమా ఉంటే మాత్రం రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. ఉన్నంతలో కెజిఎఫ్ 2 వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు కావడంతో మిస్ చేసుకున్నవాళ్ళు దాదాపు ఎవరూ లేరు. ఇదండీ సల్లు భాయ్ మిస్ చేసుకున్న రంజాన్ ఛాన్స్

This post was last modified on May 4, 2022 6:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

31 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

1 hour ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago