ప్రతి సంవత్సరం రంజాన్ పండగంటే ఖచ్చితంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అంతగా భాయ్ మూవీకి అలవాటు పడ్డారు బాలీవుడ్ లవర్స్. ఇంకే ఇతర హీరో వచ్చినా అతని స్థాయిలో కలెక్షన్లు రావనేది చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. ఆఖరికి డిజాస్టర్లు కూడా వంద కోట్ల గ్రాస్ దాటిన దాఖలాలు ఉన్నాయి.
అందుకే సల్మాన్ ఈద్ ని మిస్ కాకుండా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడుకుని రిలీజులను ప్లాన్ చేసుకుంటాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల గత రెండేళ్లుగా అది సాధ్యపడటం లేదు. 2018లో వచ్చిన రేస్ 3 దారుణమైన కంటెంట్ తోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మరుసటి ఏడాది విడుదలైన భారత్ యావరేజ్ గా ఉన్నా ప్రేక్షకులు భారీ కలెక్షన్లు ఇచ్చారు.
ఇక రాధే డైరెక్ట్ ఓటిటి కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. ఈ గ్యాప్ ని ఇతర స్టార్లు వాడుకోలేకపోయారు. దీంతో ఇప్పుడీ 2022 రంజాన్ నార్త్ బాక్సాఫీస్ కు చప్పగా మిగిలిపోయింది. రెండు రోజుల క్రితం రిలీజైన హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించగా రన్ 34 పర్వాలేదనిపించుకున్నా ఫిగర్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ సెలవు రోజే అయినా ఉత్తరాది థియేటర్ల ఆక్యుపెన్సీ 25 శాతం లోపే ఉందట. ఉపవాసదీక్ష కారణంగా సినిమా హాళ్లకు దూరంగా ఉన్న ముస్లింలు కొత్త చిత్రాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ సల్మాన్ సినిమా ఉంటే మాత్రం రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. ఉన్నంతలో కెజిఎఫ్ 2 వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు కావడంతో మిస్ చేసుకున్నవాళ్ళు దాదాపు ఎవరూ లేరు. ఇదండీ సల్లు భాయ్ మిస్ చేసుకున్న రంజాన్ ఛాన్స్
This post was last modified on May 4, 2022 6:18 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…