ప్రతి సంవత్సరం రంజాన్ పండగంటే ఖచ్చితంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అంతగా భాయ్ మూవీకి అలవాటు పడ్డారు బాలీవుడ్ లవర్స్. ఇంకే ఇతర హీరో వచ్చినా అతని స్థాయిలో కలెక్షన్లు రావనేది చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. ఆఖరికి డిజాస్టర్లు కూడా వంద కోట్ల గ్రాస్ దాటిన దాఖలాలు ఉన్నాయి.
అందుకే సల్మాన్ ఈద్ ని మిస్ కాకుండా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడుకుని రిలీజులను ప్లాన్ చేసుకుంటాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల గత రెండేళ్లుగా అది సాధ్యపడటం లేదు. 2018లో వచ్చిన రేస్ 3 దారుణమైన కంటెంట్ తోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మరుసటి ఏడాది విడుదలైన భారత్ యావరేజ్ గా ఉన్నా ప్రేక్షకులు భారీ కలెక్షన్లు ఇచ్చారు.
ఇక రాధే డైరెక్ట్ ఓటిటి కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. ఈ గ్యాప్ ని ఇతర స్టార్లు వాడుకోలేకపోయారు. దీంతో ఇప్పుడీ 2022 రంజాన్ నార్త్ బాక్సాఫీస్ కు చప్పగా మిగిలిపోయింది. రెండు రోజుల క్రితం రిలీజైన హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించగా రన్ 34 పర్వాలేదనిపించుకున్నా ఫిగర్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ సెలవు రోజే అయినా ఉత్తరాది థియేటర్ల ఆక్యుపెన్సీ 25 శాతం లోపే ఉందట. ఉపవాసదీక్ష కారణంగా సినిమా హాళ్లకు దూరంగా ఉన్న ముస్లింలు కొత్త చిత్రాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ సల్మాన్ సినిమా ఉంటే మాత్రం రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. ఉన్నంతలో కెజిఎఫ్ 2 వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు కావడంతో మిస్ చేసుకున్నవాళ్ళు దాదాపు ఎవరూ లేరు. ఇదండీ సల్లు భాయ్ మిస్ చేసుకున్న రంజాన్ ఛాన్స్
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…