ప్రతి సంవత్సరం రంజాన్ పండగంటే ఖచ్చితంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. అంతగా భాయ్ మూవీకి అలవాటు పడ్డారు బాలీవుడ్ లవర్స్. ఇంకే ఇతర హీరో వచ్చినా అతని స్థాయిలో కలెక్షన్లు రావనేది చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. ఆఖరికి డిజాస్టర్లు కూడా వంద కోట్ల గ్రాస్ దాటిన దాఖలాలు ఉన్నాయి.
అందుకే సల్మాన్ ఈద్ ని మిస్ కాకుండా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడుకుని రిలీజులను ప్లాన్ చేసుకుంటాడు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల గత రెండేళ్లుగా అది సాధ్యపడటం లేదు. 2018లో వచ్చిన రేస్ 3 దారుణమైన కంటెంట్ తోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మరుసటి ఏడాది విడుదలైన భారత్ యావరేజ్ గా ఉన్నా ప్రేక్షకులు భారీ కలెక్షన్లు ఇచ్చారు.
ఇక రాధే డైరెక్ట్ ఓటిటి కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. ఈ గ్యాప్ ని ఇతర స్టార్లు వాడుకోలేకపోయారు. దీంతో ఇప్పుడీ 2022 రంజాన్ నార్త్ బాక్సాఫీస్ కు చప్పగా మిగిలిపోయింది. రెండు రోజుల క్రితం రిలీజైన హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించగా రన్ 34 పర్వాలేదనిపించుకున్నా ఫిగర్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇవాళ సెలవు రోజే అయినా ఉత్తరాది థియేటర్ల ఆక్యుపెన్సీ 25 శాతం లోపే ఉందట. ఉపవాసదీక్ష కారణంగా సినిమా హాళ్లకు దూరంగా ఉన్న ముస్లింలు కొత్త చిత్రాల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ సల్మాన్ సినిమా ఉంటే మాత్రం రచ్చ ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. ఉన్నంతలో కెజిఎఫ్ 2 వైపే పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ నలభై రోజులు కావడంతో మిస్ చేసుకున్నవాళ్ళు దాదాపు ఎవరూ లేరు. ఇదండీ సల్లు భాయ్ మిస్ చేసుకున్న రంజాన్ ఛాన్స్
This post was last modified on May 4, 2022 6:18 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…