దేశంలోనే అత్యుత్తమ డ్యాన్సర్లుగా చెప్పుకోదగ్గ స్టార్ హీరోలు టాలీవుడ్ సొంతం. నిన్నటి తరంలో చిరంజీవి తిరుగులేని డ్యాన్సర్ అయితే.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి సూపర్ డ్యాన్సర్లు టాలీవుడ్ సొంతం. వీళ్లు కాక రామ్ లాంటి వాళ్లు కూడా మంచి డ్యాన్సర్లే. దాదాపు వీళ్లందరితోనూ పని చేసి, ఇప్పుడు టాలీవుడ్లోనే కాక సౌత్ ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కే ప్రతి పెద్ద సినిమాలోనూ శేఖర్ కంపోజ్ చేసిన పాట కచ్చితంగా ఉంటోంది. మహేష్ బాబు బేసిగ్గా అంత మంచి డ్యాన్సర్ కాదన్న పేరున్నప్పటికీ.. ‘సర్కారు వారి పాట’లో కళావతి పాటలో అతడితో అందమైన స్టెప్స్ వేయించి మార్కులు కొట్టేశాడు శేఖర్. ఈ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అతను ఈ రోజు మీడియాను కలిశాడు.
ఈ సందర్భంగా శేఖర్కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి మీడియా నుంచి. టాలీవుడ్లో డ్యాన్సుల పరంగా చాలా తక్కువ కష్టపడేది, ఈజీగా స్టెప్స్ వేసేది ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు శేఖర్. ఎంత పెద్ద స్టార్లయినా, డ్యాన్సర్లయినా రిహార్సల్స్ అనేది సర్వ సాధారణమని.. తారక్ మాత్రం అసలు రిహార్సల్స్ చేయకుండా నేరుగా సెట్స్కు వచ్చి అప్పటికప్పుడు చెప్పి స్టెప్ వేసేస్తాడని శేఖర్ ఎలివేషన్ ఇచ్చాడు. దీన్ని బట్టి తారక్ ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘ఆచార్య’ సినిమాలో చిరు-చరణ్ కలిసి చేసిన భలే బంజారా పాట అనుకున్న స్థాయిలో లేదు అన్న విమర్శ మీద శేఖర్ స్పందించాడు. ఏదైనా సరే.. పాటకు తగ్గట్లే ఉంటుందని.. పాటను అనుసరించే తాను స్టెప్స్ కంపోజ్ చేశానని శేఖర్ తెలిపాడు. నిజానికి ఈ పాట తొలిసారి విన్నపుడే అనుకున్నంత ఊపు లేదనిపించింది. వినడానికి బాగున్నా.. మరీ విరగబడి డ్యాన్సులు వేసే స్థాయిలో ఆ పాటలో ఊపు కనిపించలేదు. అయినప్పటికీ శేఖర్ ఉన్నంతలో మంచి స్టెప్పే కంపోజ్ చేశాడని చెప్పాలి.
This post was last modified on May 4, 2022 1:29 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…