Movie News

చైతు వెబ్ సిరీస్ లో షాకింగ్ పాయింట్

ఒకపక్క మేనమామ వెంకటేష్ నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ డెబ్యూ చేయనుండగా మరోవైపు నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ తో దూత ద్వారా ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సంస్థ ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో దీని ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. మంచి ఫామ్ ఉన్న సమయంలో చైతు ఇలా స్మార్ట్ స్క్రీన్ వైపు ఆసక్తి చూపించడం మంచి పరిణామం.

కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ రూపంలోనూ తమ ఫేవరెట్ హీరోని అభిమానులు పదే పదే చూసుకునే అవకాశం దక్కుతుంది. దూతకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం, థాంక్ యు తర్వాత వరసగా మూడోసారి చైతుతో చేస్తున్నారు. దూతకు సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ లీక్స్ ఫ్యాన్స్ కి ఉత్సాహం కలిగించేలా ఉన్నాయి.

దూత హారర్ జానరే అయినప్పటికీ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. విక్రమ్ అప్పట్లో మాధవన్ తో తీసిన 13B పెద్ద సెన్సేషన్. ఊహించని పాయింట్ తో టీవీ సీరియల్ పాత్రల ద్వారా భయాన్ని సృష్టించి విక్రమ్ కుమార్ చేసిన ప్రయోగం అన్ని భాషల్లోనూ సక్సెస్ అయ్యింది.

ఇప్పుడీ దూతలో కూడా ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందట. నిర్జీవంగా ఉండే వస్తువులు తప్పు చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. చట్టంలో వీటికి శిక్ష ఉండదు పోలీసులు సైతం ఏమి చేయలేని పరిస్థితి తలెత్తుంది. చైతు కుటుంబాన్ని ఒక ప్రమాదం చుట్టుముడుతుంది. ఇంతకీ దూత ఎవరు, కంటికి కనిపించని దెయ్యాల నుంచి తన ఫ్యామిలీని చైతు ఎలా కాపాడుకున్నాడనే పాయింట్ మీద రూపొందుతోందట. లైన్ ఎలా అనిపించినా విక్రమ్ కుమార్ తనదైన స్క్రీన్ ప్లే మేజిక్ చేయడం ఖాయమంటున్నారు

This post was last modified on May 3, 2022 7:57 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

26 minutes ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

2 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

5 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

5 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

5 hours ago