భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ.. రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా చేయాలనుకున్నారట. కానీ అప్పటికే ఆర్ఆర్ఆర్ కమిటై ఖాళీ లేకుండా ఉండడంతో చరణ్ బదులు తనతో సినిమా చేయాలని చిరు అడగడం, మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చిందని కొరటాల మరింత సంతోషించడం, ఆ తర్వాత కీలక పాత్రకు రామ్ చరణ్ను తీసుకోవడం జరిగాయి. నిజానికి ఇందులో స్పెషల్ రోల్ చేయడానికి కూడా చరణ్కు ఖాళీ లేకపోయినా.. తన భర్త, కొడుకులను ఒకే సినిమాలో చూడాలన్న సురేఖ కోరిక మేరకు చరణ్ ఎలాగోలా వీలు చేసుకుని ఈ సినిమాలో నటించడం జరిగింది.
తన భార్య కల ఇది అని చెప్పి రాజమౌళికి స్వయంగా చిరునే చెప్పి ఈ సినిమాలో తన కొడుకు నటించేలా చూసినట్లు వెల్లడంచడం తెలిసిందే. దీన్ని బట్టి ఆచార్య చిరు కుటుంబానికి ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకుముందు మగధీరలో చిరు ఒక ఐదు నిమిషాలు సందడి చేసినా.. అదో చిన్న క్యామియో మాత్రమే. పైగా చిరు అప్పటికి సినిమాలకు దూరంగా ఉన్నారు.
కానీ ఆచార్యలో ఇద్దరూ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో దీన్ని ఇటు మెగా ఫ్యామిలీ.. అటు మెగా అభిమానులు చాలా ప్రత్యేకంగా చూశారు. వాళ్లిద్దరినీ వెండితెరపై చూడటానికి తహతహలాడారు. ఈ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేని తీపి గుర్తు అవుతుందని అంచనా వేశారు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. ఇకపై ఆచార్య గురించి మాట్లాడుకోలేని, దాన్ని గుర్తు చేసుకోలేని పరిస్థితి వచ్చేలా ఉంది.
టాలీవుడ్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఆచార్య నిలవబోతోంది. 60-70 కోట్ల మధ్య నష్టం అంటున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. సినిమా కాస్త తగ్గినా.. మహా అయితే ఆచార్య కొరటాల గత సినిమాల స్థాయిలో బ్లాక్బస్టర్ కాదేమో అనుకున్నారు కానీ.. ఓ మోస్తరు విజయమైనా సాధిస్తుందనే అంచనా వేశారు. కానీ ఇప్పుడిది ఇంత పెద్ద డిజాస్టర్ అయి చిరు-చరణ్ల కలయికను ఒక గాయంలా మార్చేయడం మెగా అభిమానులకు తీరని వేదన కలిగించేదే.
This post was last modified on May 1, 2022 11:18 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…