భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ.. రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా చేయాలనుకున్నారట. కానీ అప్పటికే ఆర్ఆర్ఆర్ కమిటై ఖాళీ లేకుండా ఉండడంతో చరణ్ బదులు తనతో సినిమా చేయాలని చిరు అడగడం, మెగాస్టార్తో సినిమా చేసే అవకాశం వచ్చిందని కొరటాల మరింత సంతోషించడం, ఆ తర్వాత కీలక పాత్రకు రామ్ చరణ్ను తీసుకోవడం జరిగాయి. నిజానికి ఇందులో స్పెషల్ రోల్ చేయడానికి కూడా చరణ్కు ఖాళీ లేకపోయినా.. తన భర్త, కొడుకులను ఒకే సినిమాలో చూడాలన్న సురేఖ కోరిక మేరకు చరణ్ ఎలాగోలా వీలు చేసుకుని ఈ సినిమాలో నటించడం జరిగింది.
తన భార్య కల ఇది అని చెప్పి రాజమౌళికి స్వయంగా చిరునే చెప్పి ఈ సినిమాలో తన కొడుకు నటించేలా చూసినట్లు వెల్లడంచడం తెలిసిందే. దీన్ని బట్టి ఆచార్య చిరు కుటుంబానికి ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు.
ఇంతకుముందు మగధీరలో చిరు ఒక ఐదు నిమిషాలు సందడి చేసినా.. అదో చిన్న క్యామియో మాత్రమే. పైగా చిరు అప్పటికి సినిమాలకు దూరంగా ఉన్నారు.
కానీ ఆచార్యలో ఇద్దరూ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో దీన్ని ఇటు మెగా ఫ్యామిలీ.. అటు మెగా అభిమానులు చాలా ప్రత్యేకంగా చూశారు. వాళ్లిద్దరినీ వెండితెరపై చూడటానికి తహతహలాడారు. ఈ చిత్రం ఎప్పటికీ మరిచిపోలేని తీపి గుర్తు అవుతుందని అంచనా వేశారు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. ఇకపై ఆచార్య గురించి మాట్లాడుకోలేని, దాన్ని గుర్తు చేసుకోలేని పరిస్థితి వచ్చేలా ఉంది.
టాలీవుడ్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఆచార్య నిలవబోతోంది. 60-70 కోట్ల మధ్య నష్టం అంటున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. సినిమా కాస్త తగ్గినా.. మహా అయితే ఆచార్య కొరటాల గత సినిమాల స్థాయిలో బ్లాక్బస్టర్ కాదేమో అనుకున్నారు కానీ.. ఓ మోస్తరు విజయమైనా సాధిస్తుందనే అంచనా వేశారు. కానీ ఇప్పుడిది ఇంత పెద్ద డిజాస్టర్ అయి చిరు-చరణ్ల కలయికను ఒక గాయంలా మార్చేయడం మెగా అభిమానులకు తీరని వేదన కలిగించేదే.
This post was last modified on May 1, 2022 11:18 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…