దేశంలో ‘హిందీ’ గొడవ రోజు రోజుకూ పెద్దదే అవుతోంది. భారతీయ ప్రజలందరూ ఉమ్మడి భాషగా ఇంగ్లిష్ను కాకుండా హిందీని ఉపయోగించాలని కొన్ని రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం పట్ల దక్షిణాది జనాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇంతలో కన్నడ సినీ నటుడు సుదీప్.. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది చిత్రాల ఆధిపత్యం గురించి మాట్లాడాడు.
హిందీ ఇంకెంతమాత్రం జాతీయ భాష కాదని వ్యాఖ్యానించడంతో.. దీనికి బదులుగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీలో ట్వీట్ వేసి హిందీ ప్రాధాన్యం గురించి సుదీప్కు చాటిచెప్పే ప్రయత్నం చేయడం.. ఈ క్రమంలో హిందీలో మీ సినిమాలను ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. అజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా దుమారం రేపాయి. దీని మీద రాజకీయ నాయకులు కూడా స్పందించారు.
జాతీయ టీవీ ఛానెళ్లలో డిబేట్లు కూడా నడిచాయి. తమిళ నటి కస్తూరి లాంటి వాళ్లు సౌత్ మీద హిందీ ఇంపోజిషన్ గురించి తీవ్ర స్థాయిలోనే దుయ్యబట్టారు. కట్ చేస్తే ఇప్పుడీ వివాదంలోకి కంగనా రనౌత్ కూడా చేరింది. తన కొత్త చిత్రం ‘దాకడ్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒక విలేకరి సుదీప్-అజయ్ మాటల యుద్ధం గురించి ప్రస్తావించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. వివాదాలకు మారుపేరైన కంగనాను ఇలాంటి ఇష్యూ మీద అడిగితే.. ఏదో ఒక బోల్డ్ కామెంట్ చేస్తుందని అనుకుంటాం.
కానీ ఆమె కొంచెం ఆచితూచే స్పందించింది. హిందీని జాతీయ భాషగా రాజ్యాంగం గుర్తించిన మాట వాస్తవమని.. కేంద్ర ప్రభుత్వం నడిచేది ఢిల్లీలో కాబట్టి హిందీని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించినట్లే అని.. అజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆమె వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఆమె కన్నడ, తమిళం లాంటి దక్షిణాది భాషల గొప్పదనం గురించి మాట్లాడింది.
ఇవి హిందీ కంటే ప్రాచీనమైనవని విన్నానని.. అలాంటపుడు తమ భాషకు గౌరవం దక్కాలని దక్షిణాది వాళ్లు కోరుకోవడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడింది. తన దృష్టిలో జాతీయ భాషగా హిందీని కాకుండా సంస్కృతాన్ని పెట్టాల్సిందని.. హిందీ, తమిళం, కన్నడ సహా చాలా భారతీయ భాషలు సంస్కృతం నుంచే వచ్చాయి కాబట్టి, అన్నిటికంటేఅదే ప్రాచీన భాష కాబట్టి దాన్నే జాతీయ భాషగా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.
This post was last modified on April 30, 2022 11:05 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…