Movie News

కోర్టు బోనులో బిగ్ బాస్?

స‌మాజంలో ఇత‌రుల గురించి ప‌ట్టించుకోక‌పోతే భ‌విష్య‌త్ లో మ‌న‌కు ఏదైనా స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు ఇత‌రులు మ‌న‌ల్ని ప‌ట్టించుకోరు… అని అంటోంది ఏపీ హై కోర్టు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. ఇత‌రుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఎప్ప‌టి నుంచో ఉంది కానీ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ఉన్నా, అనైతిక‌త ఉన్నా కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం అన్న‌ది ఇప్పుడొక  నిర్ల‌క్ష్య వైఖ‌రికి
ద‌ర్ప‌ణం పడుతోంది. బిగ్ బాస్ వ‌ద్దు అని ఎన్నో సార్లు ఎంతో మంది మొత్తుకున్నా ఛానెళ్లు ఆగ‌డం లేదు. వీటికి వ‌చ్చే హోస్టులు భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుని ఛానెళ్ల టీఆర్పీని పెంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నారు.

నాగార్జున కానీ తార‌క్ కానీ ఇలాంటి హీరోలు అంతా బిగ్ బాస్ షో రేంజ్ ను పెంచారు. త‌ద్వారా అగ్ర క‌థానాయ‌కుల ప్ర‌భావం చాలా ఉంది ఈ షో పై !
పోనీ బిగ్ బాస్ ఏమ‌యినా జీవితాల‌ను మార్చేస్తుంది. ఈ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విజేత‌లు ఏమ‌యినా క్ష‌ణం తీరుబాటు లేకుండా అవ‌కాశాలు అందుకుంటున్నారా అంటే అదీ లేదు. కానీ ఈ షో కార‌ణంగా  ఎన్నో ఆర్మీలు పుట్టుకు వ‌చ్చాయి. ఎంతో డ్రామా న‌డిచింది. ఎన్నో కోట్ల రూపాయ‌ల వ్యాపారం ఈ షో ను ఆనుకునే జ‌రిగింది కానీ దీనిని ఆప‌డం ఎవ్వ‌రి త‌రం కాలేదు.

ఆఖ‌రికి షో ఇప్పుడు ఓటీటీల‌లో బ్రాడ్ కాస్ట్ అవుతోంది. దీనిని కూడా కోర్టు ఆపుతుందా లేదా అన్న‌ది  చెప్ప‌లేం. ఎందుకంటే డిజిట‌ల్ మాధ్య‌మాల‌ను కోర్టులు అడ్డుకోవ‌డం అన్న‌ది ఆశించినంత సులువు కాదు. ఎప్ప‌టి నుంచో వివాదాల‌కు తావిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇవాళ కూడా మ‌రో వివాదాన్ని తెచ్చింది. గ‌తంలో చెప్పిన విధంగా ఇదంతా మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న అని, అనైతిక రీతికి సంకేతం అని చెబుతూ వ‌స్తోంది ప్ర‌జా సంఘాల వాద‌న‌.

బిగ్ బాస్ షో పై ఇప్ప‌టికే సీపీఐ నారాయ‌ణ ఎన్నో సార్లు విమ‌ర్శ‌లు చేశారు. అయినా కూడా అవేవీ వినిపించుకోలేదు షో నిర్వాహ‌కులు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కోర్టు జోక్యం చేసుకుంది ఓ పిటిష‌నర్ చొర‌వ కార‌ణంగా ! దీంతో ఇప్పుడు ఓటీటీ కేంద్రంగా ప్ర‌సారితం అవుతున్న బిగ్ బాస్ షో నిలుపుదల సాధ్య‌మా కాదా అన్న చ‌ర్చ న‌డుస్తోంది.

బిగ్ బాస్ రియాల్టీ షో పై 2019లో ఓ పిటిష‌న్ దాఖలు అయింది. ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం  పేరిట చెన్న‌య్ కేంద్రంగా ప‌నిచేసే తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షులు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి దీనిని ఏపీ హై కోర్టులో దాఖ‌లు చేశారు. విప‌రీతం అయిన వికృత పోక‌డ‌ల‌ను ప్రోత్స‌హించే ఈ షోను నిలుపుద‌ల చేయాల‌ని, దీనిపై త‌క్ష‌ణం అత్యవ‌స‌రంగా విచార‌ణ చేయాల‌ని శుక్ర‌వారం మ‌రోసారి పిటిష‌నర్ త‌ర‌ఫు న్యాయవాది త‌న త‌ర‌ఫు వాద‌న వినిపిస్తూ కోర్టును కోరారు. దీనిపై న్యాయ స్థానం కూడా సానుకూలంగానే స్పందించి, 2019 లో వేసిన పిటిష‌న్ పై ఇంత‌ర‌కూ మీరు ఏ ఉత్త‌ర్వూ పొంద‌లేదా అని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. 

This post was last modified on April 30, 2022 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

2 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

2 hours ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

3 hours ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

5 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

9 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

10 hours ago