బాలీవుడ్లో ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అంటే కంగనా రనౌతే. కేవలం ఆమె పేరు మీదే సినిమాలు ఆడుతున్నాయి కొన్నేళ్లుగా. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వంద కోట్ల వసూళ్లు రాబట్టగల సత్తా ఆమె సొంతం. మణికర్ణిక తర్వాత ఆమె నటించిన జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి సినిమాలు కమర్షియల్గా ఆశించిన ఫలితాన్నివ్వకున్నా కంగనా ఇమేజ్ అయితే దెబ్బ తినలేదు. ఇప్పటికీ ఆమె సినిమా వస్తుంటే పెద్ద సంఖ్యలోనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు.
కెరీర్లో అనేక భిన్నమైన పాత్రలు చేసిన కంగనా.. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే.. దాకడ్. మామూలుగా హీరోలే చేసే స్పెషల్ ఏజెంట్ పాత్రలో కంగనా కనిపించనుందీ చిత్రంలో. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. స్టార్ హీరోలకు దీటుగా యాక్షన్ విన్యాసాలతో అదరగొట్టేసింది కంగనా. ఇటు గ్లామర్తో, అటు యాక్షన్తో కంగనా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పని చేసే ఏజెంట్ పాత్రలో కంగనా నటించిందీ చిత్రంలో. హీరోయిన్లు ఏజెంట్ పాత్రల్లో కనిపించడం, యాక్షన్ విన్యాసాలు చేయడం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. ఐతే తాను దేనికీ తక్కువ కాదని రుజువు చేయాలని తపించే కంగనా.. చాలా కష్టమైన విన్యాసాలతో వావ్ అనిపించింది.
హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా కనిపించాయి ఇందులో యాక్షన్ సన్నివేశాలు. తాను పూర్తి చేయాల్సిన ఆపరేషన్లో భాగంగా వేశ్య అవతారంలోకి కూడా మారడం ఇందులో హైలైట్. ట్రైలర్ అంతా కూడా వన్ ఉమన్ షో అన్నట్లే కంగనానే కనిపించింది అంతటా. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాడు. రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దీపక్, ముకుల్ నిర్మించారు. ఈ నెల 20న దాకడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…