మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రతి కథానాయికకూ ఉంటుంది. కాజల్ అగర్వాల్ ‘ఖైదీ నంబర్ 150’తో ఆ కోరిక తీర్చుకుంది. ఆల్రెడీ చరణ్కు కథానాయికగా నటించినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా చిరు పక్కన హీరోయిన్గా తీసుకున్నారామెను. తర్వాత ‘ఆచార్య’ కోసం కథానాయిక వేట కూడా కాజల్ దగ్గరే ఆగింది. చిరుతో మరోసారి జోడీ కట్టే అవకాశం దక్కించుకుందామె. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
కొన్ని రోజులు చిత్రీకరణ జరిపాక కాజల్ పాత్ర సరిగా రాలేదని భావించి ఆమెను పక్కన పెట్టేశారు. ఈ విషయం కూడా చాలా ఆలస్యంగా రివీలైంది. ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎవ్వరూ కాజల్ పేరెత్తకపోవడం సందేహాలు రేకెత్తిస్తే.. తర్వాత ఓ ఇంటర్వ్యూలో కొరటాల అసలు విషయం వెల్లడించాడు. ఆమె పాత్రను తీసేశామన్నాడు. ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘లాహె లాహె’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో కాజల్ కనిపించడం గుర్తుండే ఉంటుంది.
ఇదే విషయంలో ఇంటర్వ్యూలో అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు కొరటాల. సినిమాలో చూడండి అనేశాడు. కాజల్తో కొన్ని రోజులు పని చేయించుకుని, ఆమెకు కొంత పారితోషకం కూడా ఇచ్చారు కాబట్టి కనీసం పాటలో క్యామియో లాగా ఆమెను ఉపయోగించుకుంటారని, ఆ పాట వరకు ఆమె తళుక్కుమంటుందని ఆమె అభిమానులు భావించారు. ఇదే ఉద్దేశంతో సినిమాకు వెళ్తే వారికి పెద్ద షాక్ తగిలింది. లాహే లాహే పాట మొదలైంది.. ముందుకు సాగింది.. ముగిసిపోయింది. కానీ కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఆమె దృశ్యాలను అక్కడ కూడా లేపేశారన్నమాట. దీంతో ఈ సంగతేతో ముందే చెప్పేస్తే బాగుండేది కదా, మళ్లీ ఊరించి ఉస్సూరుమనిపించడం దేనికి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాజల్ అభిమానుల నుంచి. ఇక కాజల్ పాత్రను తీసేయడం వల్ల సినిమాకేమైనా అదనపు ప్రయోజనం దక్కిందా అన్న చర్చ కూడా నడుస్తోందిప్పుడు. ఓపక్క రెజీనాతో చిరు ఐటెం సాంగ్లో చిందులు వేయడానికి లేని ఇబ్బంది.. ఆ పాత్రకు కథానాయికను పెడితే ఏమొచ్చింది అని కాజల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారిప్పుడు.
This post was last modified on April 30, 2022 8:50 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…