మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రతి కథానాయికకూ ఉంటుంది. కాజల్ అగర్వాల్ ‘ఖైదీ నంబర్ 150’తో ఆ కోరిక తీర్చుకుంది. ఆల్రెడీ చరణ్కు కథానాయికగా నటించినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా చిరు పక్కన హీరోయిన్గా తీసుకున్నారామెను. తర్వాత ‘ఆచార్య’ కోసం కథానాయిక వేట కూడా కాజల్ దగ్గరే ఆగింది. చిరుతో మరోసారి జోడీ కట్టే అవకాశం దక్కించుకుందామె. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
కొన్ని రోజులు చిత్రీకరణ జరిపాక కాజల్ పాత్ర సరిగా రాలేదని భావించి ఆమెను పక్కన పెట్టేశారు. ఈ విషయం కూడా చాలా ఆలస్యంగా రివీలైంది. ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎవ్వరూ కాజల్ పేరెత్తకపోవడం సందేహాలు రేకెత్తిస్తే.. తర్వాత ఓ ఇంటర్వ్యూలో కొరటాల అసలు విషయం వెల్లడించాడు. ఆమె పాత్రను తీసేశామన్నాడు. ఐతే ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘లాహె లాహె’ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో కాజల్ కనిపించడం గుర్తుండే ఉంటుంది.
ఇదే విషయంలో ఇంటర్వ్యూలో అడిగితే.. సూటిగా సమాధానం చెప్పలేదు కొరటాల. సినిమాలో చూడండి అనేశాడు. కాజల్తో కొన్ని రోజులు పని చేయించుకుని, ఆమెకు కొంత పారితోషకం కూడా ఇచ్చారు కాబట్టి కనీసం పాటలో క్యామియో లాగా ఆమెను ఉపయోగించుకుంటారని, ఆ పాట వరకు ఆమె తళుక్కుమంటుందని ఆమె అభిమానులు భావించారు. ఇదే ఉద్దేశంతో సినిమాకు వెళ్తే వారికి పెద్ద షాక్ తగిలింది. లాహే లాహే పాట మొదలైంది.. ముందుకు సాగింది.. ముగిసిపోయింది. కానీ కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఆమె దృశ్యాలను అక్కడ కూడా లేపేశారన్నమాట. దీంతో ఈ సంగతేతో ముందే చెప్పేస్తే బాగుండేది కదా, మళ్లీ ఊరించి ఉస్సూరుమనిపించడం దేనికి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాజల్ అభిమానుల నుంచి. ఇక కాజల్ పాత్రను తీసేయడం వల్ల సినిమాకేమైనా అదనపు ప్రయోజనం దక్కిందా అన్న చర్చ కూడా నడుస్తోందిప్పుడు. ఓపక్క రెజీనాతో చిరు ఐటెం సాంగ్లో చిందులు వేయడానికి లేని ఇబ్బంది.. ఆ పాత్రకు కథానాయికను పెడితే ఏమొచ్చింది అని కాజల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారిప్పుడు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…