మహేష్ పక్కన చేసి.. సెకండ్ హీరోయిన్ గానా?

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ ఇద్దరి మధ్య జరుగుతోంది. పూజ హెగ్డే, రష్మిక ఇద్దరూ నెంబర్ వన్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రష్మిక సరిలేరు నీకెవ్వరు, భీష్మ విజయాలతో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఆమె తదుపరి చిత్రం కూడా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతోనే చేస్తోంది.

మొదట్లో కుర్ర హీరోలతో నటించినా కానీ ఇప్పుడు రష్మిక రేంజ్ వేరు. తదుపరి సినిమాలు చేస్తే చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో చేస్తుంది. ఒకవేళ మధ్య శ్రేణి హీరోలతో చేసినా కానీ సోలో హీరోయిన్ అయితేనే చేయడం ఖచ్చితం. టాప్ హీరోలు పోటీ పడినా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్న రష్మిక ఒక మీడియం బడ్జెట్ సినిమాలో, నాని నటించే శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తుందని గాసిప్స్ పుట్టించారు.

సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించే చిత్రంలో రష్మిక ఎలా నటిస్తుంది. అది కూడా తనకు అత్యంత డిమాండ్ ఉన్న దశలో? ఇదంతా సదరు సినిమాకు హైప్ తేవడం కోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు.